Vastu Tips : వాస్తు ప్రకారం ఇంట్లో ఈ విగ్రహాలు ఉంచితే అదృష్టం తలుపు తడుతుంది.

  • Written By:
  • Publish Date - November 27, 2022 / 07:24 AM IST

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఉన్న వస్తువు సానుకూల ప్రతికూల శక్తిని కలిగి ఉంటుంది. అందుకే వాస్తు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో కొన్ని వస్తువులను ఉంచినట్లయితే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. తద్వారా సానుకూల శక్తి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అలాంటి కొన్ని విగ్రహాల గురించి వాస్తు శాస్త్రంలో పేర్కొనబడింది. అలంకరణగా ఉపయోగించే ఈ విగ్రహాలు వ్యక్తి, అదృష్టాన్ని ప్రకాశింపజేస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఏ విగ్రహాన్ని ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకోండి.

ఏనుగు విగ్రహం
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఏనుగు వెండి లేదా ఇత్తడి విగ్రహాన్ని ఉంచడం శుభప్రదం. ఎందుకంటే ఏనుగు సంపదకు చిహ్నంగా పరిగణిస్తారు. దీన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
అంతే కాదు, ఇంట్లో ఏనుగు విగ్రహం ఉండటం వల్ల డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. అదే సమయంలో, వాస్తు శాస్త్రం ప్రకారం, పడకగదిలో ఏనుగు విగ్రహాన్ని ఉంచడం కూడా వైవాహిక జీవితంలో ఆనందాన్ని ఇస్తుంది.

గుర్రపు విగ్రహం
ఇంట్లో గుర్రపు విగ్రహాన్ని ఉంచడం వల్ల విజయం, బలం లభిస్తుంది. ఇంటి ఉత్తర దిశలో గుర్రపు ప్రతిమను ఉంచడం ద్వారా ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. మీరు వ్యాపారంలో కూడా గొప్ప విజయాన్ని పొందుతారు. కుటుంబంలో ఎల్లప్పుడూ ఆనందం ఉంటుంది.

హంస విగ్రహం
ఒక జంట హంసలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. ఈ విగ్రహాలను ఇంటికి నైరుతి దిశలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, సద్భావన పెరుగుతాయి. జీవితం ఆనందంగా ఉంటుంది.

 ఆవు, దూడ విగ్రహం 
ఆవుతో పాటు దూడ కూడా ఉంటే పురోభివృద్ధి కలుగుతుంది. ఇలాంటి ఇత్తడితో చేసిన విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. దీంతో పాటు పిల్లలు చదువులో చురుగ్గా ఉంటారని వాస్తు చెబుతోంది.

తాబేలు విగ్రహం
శ్రేయస్సు, సంపద కోసం ఇంట్లో తాబేలు విగ్రహాన్ని ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో నివసించే వారి ఆయుష్షు కూడా పెరుగుతుందని నమ్మకం. అలాగే తాబేలును ఇంటికి తూర్పు, ఉత్తర దిశలో ఉంచడం మంచిది.