తిరుమలలో (Tirumala) వైకుంఠ ద్వార దర్శనం జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఉన్నందున 300 రూపాయల ప్రత్యేక దర్శనం ఆన్ లైన్ కోటా దర్శనం టికెట్లను రోజుకు 25,000 వంతున, ఈ పది రోజులకు రెండు లక్షల యాభై వేల టికెట్లను డిసెంబర్ 24వ తేదీ ఉదయం 9 గంటలకు టీటీడీ (TTD) ఆన్ లైన్లో విడుదల చేయనుంది. ప్రస్తుతానికి ఈ పది రోజులకు మాత్రమే రిలీజ్ చేశారు. ఆ తరువాత జనవరిలో మిగిలిన రోజులకు 300 దర్శనం ఆన్ లైన్ కోటాను ఈ నెలలోనే మరో రోజు టీటీడీ (TTD) విడుదల చేయనుంది. ఆన్ లైన్ కోటాలో టికెట్లను బుక్ చేసుకోవడానికి ఈ లింకులో చూడండి https://tirupatibalaji.ap.gov.in
Also Read: Varahi Ammavaru : వారాహి అమ్మవారి గురించి ఆశ్చర్యకరమైన విషయాలు