Ayodhya : అయోధ్య రామమందర నిర్మాణం 30 శాతం పూర్తయినట్లు ప్రకటన..!!

అయోధ్య రామజన్మభూమిలో ఆలయ నిర్మాణానికి అయ్యే ఖర్చు సుమారు రూ.18 వందల కోట్లు అవుతుందని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అంచనా వేసింది.

  • Written By:
  • Publish Date - September 12, 2022 / 07:30 AM IST

అయోధ్య రామజన్మభూమిలో ఆలయ నిర్మాణానికి అయ్యే ఖర్చు సుమారు రూ.18 వందల కోట్లు అవుతుందని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అంచనా వేసింది. ఆదివారం అయోధ్యలోని సర్క్యూట్ హౌస్‌లో జరిగిన రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సమావేశంలో చర్చల అనంతరం ఈ అంచనా వేశారు. శ్రీరాముడి కాలం నాటి మహర్షి వాల్మీకి, గురువశిష్ట, విశ్వామిత్ర, అగస్త్య, నిషాదరాజు, శబరి, జటాయువు వంటి ప్రముఖుల ఉప ఆలయాలను రామాలయ ప్రాంగణంలో నిర్మించాలని సమావేశంలో నిర్ణయించారు.

ఈ సమావేశంలో, చాలా కాలంగా ఎదురుచూస్తున్న రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నియమాలు కూడా ఖరారు చేశారు. ఈ మేరకు తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆలయ పనులు 30 శాతానికి పైగా పూర్తయినట్లు ప్రకటించారు.

ఈ సమావేశంలో రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాలదాస్, ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, కోశాధికారి గోవిందదేవ్ గిరి, రామమందిర నిర్మాణ కమిటీ అధ్యక్షుడు నృపేంద్ర మిశ్రా, తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు స్వామి విశ్వ ప్రసన్నతీర్థం, కామేశ్వర్ డి చౌపాల్, డాక్టర్ చౌపల్ తదితరులు పాల్గొన్నారు.

అనిల్ మిశ్రా, జిల్లా మేజిస్ట్రేట్ నితీష్ కుమార్, మహంత్ నృత్య గోపాలదాస్ వారసుడు మహంత్ కమలనాయందాస్ తదితరులతో సహా ఆలయ నిర్మాణ కార్యనిర్వాహక విభాగం ఎల్ అండ్ టి, టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్స్ అధికారులు, తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు కె. పరాశరన్, బిమలేంద్రమోహన్ మిశ్రా, స్వామి పరమానంద్ మరియు హోం ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ ప్రసాద్ సమావేశం నుండి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.