ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో లాభాలు ఆర్జిస్తున్న సినిమాల్లో కమల్ హాసన్ సినిమా “విక్రమ్” ముందు వరుసలో నిలిచింది. యాక్షన్ డ్రామా అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మంగళవారం కూడా ఈ చిత్రం ఆకట్టుకునే కలెక్షన్లను రాబట్టింది. ఆంధ్రాలో చాలా ఏరియాల్లో ఈ సినిమా హౌస్ఫుల్ బోర్డులను పెట్టేసింది. ఈ చిత్రం ఉత్తరాంధ్ర ప్రాంతంలో నాలుగు రోజుల్లోనే రూ.98 లక్షలు (షేర్) వసూలు చేసింది. ఈ ప్రాంతానికి డిస్ట్రిబ్యూటర్ కోటి రూపాయలకు సినిమాను కొనుగోలు చేశాడు. కృష్ణా, గుంటూరు ప్రాంతాలకు చెందిన డిస్ట్రిబ్యూటర్ రైట్స్ని రూ.1.08 కోట్లకు కొనుగోలు చేయగా, నాలుగు రోజుల్లోనే రూ.95 లక్షల షేర్ రాబట్టింది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి రీజియన్లలో వరుసగా రూ.38 లక్షలు, రూ.21 లక్షలు వసూలు చేసింది. సీడెడ్ రీజియన్ నాలుగు రోజుల్లో రూ.90 లక్షలు వసూలు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ స్టేజ్కి చేరుకోవాలంటే ఇంకా 10 లక్షలు వసూలు చేయాలి. నైజాంలో “విక్రమ్” నాలుగు రోజుల్లో 2.60 కోట్లు కొల్లగొట్టి, ఇక్కడ రెట్టింపు లాభాలను రాబట్టింది. మొత్తానికి ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్లందరికీ లాభాలు తెచ్చిపెట్టేలా ఉంది.