Venkatesh: మాజీ మిస్ ఇండియాతో ఫ్లైట్లో వెంకీ మామ.. అందుకోసమేనా?

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి మనందరికి తెలిసిందే. వెంకటేష్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఈ వయసులో కూడా అదే ఊ

  • Written By:
  • Publish Date - March 18, 2024 / 11:04 PM IST

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి మనందరికి తెలిసిందే. వెంకటేష్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవనే సంక్రాంతి పండుగ కానుకగా సైంధవ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు హీరో వెంకటేష్. ఇది ఇలా ఉంటే వెంకటేష్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు ప్రకటిస్తాడా అని అభిమానులు ఎదురు చూస్తుండగా, తాజాగా ఒక కొత్త యాడ్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.

అయితే ఈ యాడ్ లో వెంకటేష్, మాజీ మిస్ ఇండియా మానస వారణాసి నటించారు. రియల్ ఎస్టేట్ కంపెనీ వాసవి గ్రూప్ కి సంబంధించిన ఒక యాడ్ లో వీరిద్దరూ కలిసి నటించారు. ఈ యాడ్ లో వెంకటేష్, మానస వారణాసి కలిసి ఫ్లైట్ లో హైదరాబాద్ కి వస్తుంటారు. ఫ్లైట్ లో నుంచి చూసి హైదరాబాద్ చాలా బాగుంది అని మానస అడగడంతో సిటీలోకి వెళ్లి చూద్దాం అని వెంకటేష్ అంటాడు. వాసవి గ్రూప్ కట్టిన ఇళ్లు చూపించి మానస హైదరాబాద్ కి వచ్చేస్తాను, ఇక్కడే ఉంటాను అని చెప్తుంది.

అలా ఇద్దరూ కలిసి యాడ్ చేశారు. గతంలో కూడా వెంకటేష్ పలు యాడ్స్ లో నటించిన విషయం తెలిసిందే.. అయితే తాజాగా చేసిన యాడ్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మానస వారణాసి ఈ యాడ్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. వెంకటేష్ సర్ తో పనిచేయడం హ్యాపీగా ఆడుకున్నట్టు ఉంది అంటూ పోస్ట్ చేసింది. దీంతో వెంకీమామ కొత్త యాడ్ వైరల్ గా మారింది.