Veerasimha Reddy : ట్రెండింగ్ అవుతున్న ‘వీరసింహా రెడ్డి’ ట్రైలర్!

బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'వీరసింహా రెడ్డి' సినిమా రూపొందింది.

బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘వీరసింహా రెడ్డి’ (Veerasimha Reddy) సినిమా రూపొందింది. మైత్రీ బ్యానర్ వారు నిర్మించిన ఈ సినిమా, సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును ఒంగోలులో ఘనంగా నిర్వహించారు. బాలకృష్ణకి అనేక బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన బి. గోపాల్ చేత ఈ స్టేజ్ పై ట్రైలర్ ను లాంచ్ చేయించారు.

ఇక యూ ట్యూబ్ లో ‘వీరసింహా రెడ్డి’ (Veerasimha Reddy) ట్రైలర్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. చాలా ఫాస్టుగా ఈ ట్రైలర్ 5 మిలియన్ ప్లస్ వ్యూస్ ను 300K లైక్స్ ను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఒక పోస్టర్ ను వదిలారు. ఇంకా ఈ ట్రైలర్ కి సంబంధించిన వ్యూస్, లైక్స్ డిజిట్స్ చకచకా మారిపోతూనే ఉన్నాయి.

ఈ సినిమాలో శ్రుతి హాసన్ కథానాయికగా నటించగా, మరో ముఖ్యమైన పాత్రలో హనీరోజ్ అలరించనుంది. ఇక విలన్ షేడ్స్ కలిగిన భానుమతి పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించనుండగా, ఐటమ్ నెంబర్ లో చంద్రిక రవి మెరవనుంది. మొత్తానికి ఈ సినిమా కొత్త రికార్డులకు తెరతీయనుందనేది అభిమానుల టాక్.

Also Read:  Chandra Babu : మళ్ళీ జగన్ కు ఛాన్స్ ఇస్తే ఇక అంతే! టీడీపీ వినూత్న ప్రచారం