బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ‘వీరసింహా రెడ్డి’ (Veerasimha Reddy) జనవరి 12వ తేదీన థియేటర్ల లో రిలీజ్ అయింది మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. కథాకథనాల పరంగా .. పాటల పరంగా .. డాన్సుల పరంగా .. డైలాగ్స్ పరంగా ఈ సినిమా మంచి మార్కులు కొట్టేసింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ వారు సొంతం చేసుకున్నారు. ఈ నెల 23వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన ట్రైలర్ ను కొంతసేపటిక్రితం రిలీజ్ చేశారు.
Also Read: Pathan @ ₹1000 Crore Club: రూ.1000 కోట్ల క్లబ్ కు చేరువైన ‘పఠాన్’