ఊర్వశి రౌతౌలా.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వాల్తేరు వీరయ్య సినిమాలో వేర్ ఇస్ ద పార్టీ అంటూ స్టెప్పులను ఇరగదీసింది. ఈ పాట విడుదలైన తర్వాత ఒక్కసారిగా భారీగా పాపులారిటీని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాకుండా వాల్తేరు వీరయ్య సినిమా విడుదల తర్వాత కొద్ది రోజులపాటు ఈ ముద్దుగుమ్మ పేరు మారుమోగిపోయింది. ఈ పాట సూపర్ హిట్ అవడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో ఇప్పుడు వరుసగా అవకాశాలు వచ్చి చేరుతున్నాయి. అంతేకాకుండా దర్శకులు స్పెషల్ ఫ్యాన్ కోసం ఎక్కువగా ఆమె వైపు మొగ్గు చూపుతున్నారు.
ఇది ఇలా ఉంటే హీరో అఖిల్ అక్కినేని నటించిన తాజా చిత్రం ఏజెంట్. ఈ సినిమాలో ఐటెం సాంగ్ కు స్టెప్పులు ఇరగదీసింది ఊర్వశి. కాగా ఆ పాట మాస్ ట్యూన్ లో వచ్చే ఒక జానపద గేయం అని తెలుస్తోంది. ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది అనుకుంటున్న నేపథ్యంలో ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధు చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.
అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమా యూరోప్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో అఖిల్,ఊర్వశి రౌతౌలా ని హెరాస్ చేశాడని, అతనితో పనిచేయడం కంఫర్ట్ గా లేదు అంటూ ఊర్వశి ఫీలవుతోంది అని ఉమైర్ సంధు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ ట్వీట్ పై ఆమె స్పందిస్తూ లీగల్ నోటీసులు పంపించింది.
#AkhilAkkineni “ Harassed ” Bollywood Actress #UrvashiRautela during Item Song Shoot of #Agent in Europe. As per her, He is very immature kind of actor & feeling uncomfortable working with him. pic.twitter.com/4MR48Vtgxc
— Umair Sandhu (@UmairSandu) April 18, 2023
ఇలా అసత్య ప్రచారాలు చేస్తున్న అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్న ఆమె లీగల్ నోటీసులు పంపించినట్లు ఇంస్టాగ్రామ్ లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా విషయానికి వస్తే..ఈ సినిమాను రూ. 70 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. అఖిల్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అక్కినేని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.