Upasana: గవర్నర్ తమిళిసైకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపిన ఉపాసన.. ఫోటోస్ వైరల్?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి మెగా గోడలు ఉపాసన గురించి మనందరికీ తెలిసిందే. ఉపాసన తరచూ మంచి కార్యక్రమాలు చేయడంతో పాటు మరొకవై

  • Written By:
  • Publish Date - February 2, 2024 / 09:00 AM IST

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి మెగా గోడలు ఉపాసన గురించి మనందరికీ తెలిసిందే. ఉపాసన తరచూ మంచి కార్యక్రమాలు చేయడంతో పాటు మరొకవైపు తన కూతురు కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటుంది. ఈమె నిత్యం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. తనకూ తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది ఉపాసన. అప్పుడప్పుడు తన అభిమానులకు ఫాలోవర్లకు ఆరోగ్య సూచనలు కూడా ఇస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె తెలంగాణ గవర్నర్ తమిళిసైని కలుసుకున్నారు.

అందుకు సంబందించిన ఫొటోలను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది ఉపాసన. ఈ మేరకు ఆ ఫోటోలను షేర్ చేస్తూ గవర్నర్ తమిళిసై చేసిన పనులు తన గుండెకు హత్తుకున్నాయి అని రాసుకొచ్చింది ఉపాసన. ఆ విషయంలో ఆమెకు కృతజ్ఞతలు తెలియజేయడం కోసం.. ఉపాసన రీసెంట్ గా తమిళిసైని కలుసుకున్నారు. తమిళిసైకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసిన ఉపాసన.. సీతారామ లక్ష్మణ ఆంజనేయ ప్రతిమలను బహుమతిగా అందించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా ఉపాసనా తన కూతురు క్లీంకార నామకరణం వేడుకను కూడా గిరిజన పద్ధతిలోనే చేసిన విషయం తెలిసిందే.

 

కాగా ప్రస్తుతం ఉపాసన ఒకవైపు తన కూతురు క్లీన్ కారా బాధ్యతలు చూసుకుంటూ తన కూతురితో సమయాన్ని గడుపుతున్నారు. అలాగే అప్పుడప్పుడు తన భర్త రామ్ చరణ్ మామయ్య చిరంజీవికి సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో పాటు రకరకాల ట్వీట్లు కూడా చేస్తూ ఉంటుంది. మొన్నటికి మొన్న చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు వరించడంతో డియరెస్ట్ మావయ్య అంటూ ఒక స్పెషల్ పోస్టుని చేసింది ఉపాసన. తాజాగా కూడా చిరంజీవి వర్కౌట్ కి సంబంధించిన వీడియో పై స్పందిస్తూ మా మామయ్య కూల్ అని రాసుకొచ్చింది.