Upasana Konidela: ఎలక్ట్రిక్ కారులో ఉపాసన…ధరెంతో తెలుసా..వీడియో ఇదిగో..!!

మెగాపవర్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఓ కొత్త కారును కొనుగోలు చేశారు. ఆడి కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కారు ఆడి ఇ -ట్రాన్ లో ఉపాసన విహరిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - July 30, 2022 / 09:44 PM IST

మెగాపవర్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఓ కొత్త కారును కొనుగోలు చేశారు. ఆడి కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కారు ఆడి ఇ -ట్రాన్ లో ఉపాసన విహరిస్తున్నారు. ఈ కారు విలువ దాదాపు రూ. 1.66కోట్ల పైమాటే. ఈ కారులో తాను ఎంత సౌకర్యంగా ప్రయాణిస్తున్నానన్న విషయాన్ని…కారులో కూర్చుని మరీ వివరించారు.

ఇక ప్రపంచంలో ప్రతిదీ అప్ గ్రేడ్ అవుతోందన్న ఉపాసన…దానికిఅనుగుణంగా తాను కూడా అప్ గ్రేడ్ అయ్యాయని తెలిపారు. అందులో భాగంగానే ఆడి ఇ ట్రాన్ కారును కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఈ కారులో తాను ఎంతో సౌకర్యంగా ప్రయాణిస్తున్నానని తన అవసరాలకు ఈ కారు అనువుగా ఉందన్నారు.