Kottha Bangarulokam : కొత్త బంగారు లోకం.. ఆ ఇద్దరు హీరోలు కాదన్నారా..?

Kottha Bangarulokam వరుణ్ సందేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ కొత్త బంగారు లోకం. వరుణ్ సందేష్, శ్వేతా బసు ప్రసాద్ కలిసి నటించిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్

  • Written By:
  • Publish Date - February 29, 2024 / 11:12 PM IST

Kottha Bangarulokam వరుణ్ సందేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ కొత్త బంగారు లోకం. వరుణ్ సందేష్, శ్వేతా బసు ప్రసాద్ కలిసి నటించిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ అందించిన మ్యూజిక్ సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలో హీరోగా ముందు వరుణ్ సందేష్ ని అనుకోలేదట. అప్పటికే అక్కినేని నాగార్జున వారసుడు నాగ చైతన్య హీరోగా ఎంట్రీ ఇస్తాడని తెలిసి నాగ చైతన్య కోసం ఈ కథ చెప్పాడట శ్రీకాంత్ అడ్డాల.

అయితే చైతన్యకు మాస్ ఇమేజ్ ఉన్న కథ కావాలని. లవ్ స్టోరీ వల్ల సాఫ్ట్ ఇమేజ్ వస్తుందని భావించి ఆ ఆఫర్ కాదనుకున్నారట. ఇక నాగ చైతన్య తర్వాత అప్పటికే హీరోగా సక్సెస్ అయిన రామ్ దగ్గరకు కూడా ఈ కథ తీసుకెళ్లారట. అయితే కాలేజ్ లవర్ బోయ్ గా తను కష్టమని భావించి రాం వద్దన్నాడట.

అలా వాళ్లిద్దరు కాదనడం తో వరుణ్ సందేష్ చేశాడు. ఆ సినిమా హిట్ తో వరుణ్ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే ఆ ఇమేజ్ ని వరుణ్ కాపాడుకోలేకపోయాడు. కొత్త బంగారు లోకం సినిమాలో వరుణ్ సందేష్ కాకుండా రామ్, నాగ చైతన్య అయితే ఎలా ఉండేదో ఒకసారి ఊహించుకోండి.

Also Read : Indraganti Mohanakrishna Priyadarshi : అభిరుచిగల దర్శకుడు.. ప్రతిభగల హీరో.. కాంబో సెట్ అయ్యింది..!