బెంగళూరులో ఓ టెలివిజన్ నటి సోషల్ మీడియా ద్వారా లైంగిక వేధింపులకు గురైన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలుగు, కన్నడ సీరియల్స్లో నటించే నటి రజిని (41)ని ‘నవీన్ కె మోన్’ అనే వ్యక్తి గత మూడు నెలలుగా సోషల్ మీడియా వేదికల ద్వారా వేధిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మొదట ‘Naveenz’ పేరుతో ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిన అతడు, నటి అంగీకరించకపోవడంతో మెసెంజర్ ద్వారా అశ్లీల సందేశాలు, తన ప్రయివేట్ పార్ట్స్ వీడియోలను పంపడం ప్రారంభించాడు. పలుమార్లు బ్లాక్ చేసినా సరే కొత్త పేర్లతో ఖాతాలను సృష్టించి అదే దారిలో వేధించడం కొనసాగించాడు. పలుమార్లు హెచ్చరించినా ఆగకపోవడంతో నటి చివరకు పోలీసులను ఆశ్రయించింది.
Public Holiday : రేపు గురుపూర్ణిమ.. విద్యా సంస్థలకుసెలవు
పోలీసుల వివరాల ప్రకారం, నవంబర్ 1న నిందితుడు మళ్లీ నటి రజినికి మెసేజ్ చేయడంతో ఆమె స్వయంగా అతడిని కలిసింది. “ఇకపై ఇలాంటి సందేశాలు పంపవద్దు” అని స్పష్టంగా చెప్పినా, అతడు వినకపోవడంతో ఆమె ఆ రోజు సాక్ష్యాధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా బెంగళూరు పోలీసులు లైంగిక వేధింపులు, ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా పోలీసులు నిందితుడు ఫేక్ ఐడీల ద్వారా వీడియోలు పంపినట్లు, మెసెంజర్ ద్వారా అశ్లీల చాట్లు చేసినట్లు నిర్ధారించారు.
నవీన్ బెంగళూరులోని ఒక అంతర్జాతీయ టెక్నాలజీ రిక్రూట్మెంట్ కంపెనీలో డెలివరీ మేనేజర్గా పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఆ సంస్థ లండన్, పారిస్, బ్రెజిల్, న్యూయార్క్ వంటి దేశాల్లో శాఖలను కలిగి ఉంది. తన ఉద్యోగ స్థాయి, వ్యక్తిగత జీవితం రెండింటినీ వదిలేసి నిందితుడు ఈ రకమైన ఘోర చర్యకు పాల్పడటం విచారకరం. పోలీసులు అతడిని సోమవారం అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఈ ఘటన సోషల్ మీడియా దుర్వినియోగం ఎంత తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందో మరోసారి స్పష్టమైంది. మహిళలపై సైబర్ వేధింపులు పెరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి నేరాలపై కఠిన చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
