Allu Arjun@Trivikram: బన్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మరో పాన్ ఇండియా మూవీలో అల్లు అర్జున్!

పుష్ప సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమాలపై ఫోకస్ చేస్తున్నాడు.

  • Written By:
  • Updated On - May 25, 2023 / 06:19 PM IST

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ మూవీ చేస్తున్నాడు. SSMB28 అని పిలవబడే ఈ చిత్రం జనవరి 13, 2024న థియేట్రికల్ విడుదల కానుంది. అయితే ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నాడని టాక్. వీరిద్దరి కాంబినేషన్ లో అతిపెద్ద పాన్-ఇండియా చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.  డైరెక్టర్ త్రివిక్రమ్ ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను రెడీ చేశాడట. త్రివిక్రమ్ ఇప్పటికే కథను కూడా లాక్ చేశాడు.

ఇప్పటికే స్క్రిప్ట్‌పై వర్క్ ను స్టార్ చేశాడు. అల్లు అర్జున్ (Allu Arjun) ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పాడు కానీ సైన్ చేయాల్సి ఉంది. దర్శకుడిగా త్రివిక్రమ్ మొదటి పాన్-ఇండియా ప్రాజెక్ట్. అల్లు అర్జున్ తో ఆసక్తికరమైన కథ ఇండియా వ్యాప్తంగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. త్రివిక్రమ్ డిసెంబర్ 2023 ఈ (Pan India) సినిమాను ప్రారంభించే అవకాశాలున్నాయి. 2024 మధ్యలో పుష్ప 2 విడుదలైన తర్వాత ఈ చిత్రం పూర్తి నిర్మాణ పనులు మొదలవుతాయి.

“ఈ మూవీ ఇప్పటి వరకు త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో బిగ్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. అయితే పుష్ప సక్సెస్ తో అల్లు అర్జున్ కథల ఎంపికలో జాగ్రత్తలు పాటిస్తున్నాడు. అచితూచి సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నడు. “AAకి చాలా ఆఫర్లు వస్తున్నాయి, కానీ అతను ఇప్పుడు పుష్ప 2 పై మాత్రమే దృష్టి పెట్టాలనుకుంటున్నాడు కాబట్టి అతను ఇంకా దేనిపైనా నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో అశ్వత్థామ కోసం కూడా చర్చలు జరుపుతున్నాడు, కానీ చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయి. ఇక అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల మరో భారీ కలయిక భారతీయ సినిమాలో మైలురాయిని సృష్టిస్తుందో లేదో కాలమే సమాధానం చెప్పాలి. వీరి కాంబినేషన్ లో అల వైకుంఠపురములో, జులాయి మరియు S/O సత్యమూర్తి వంటి చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

Also Read: Virat Kohli: అనుష్కకు ముందు ఐదుగురితో కోహ్లీ డేటింగ్.. భలే బ్యూటీలను పట్టేశాడే!