నార్త్ ఇండియన్ మార్కెట్లో సౌత్ ఇండియన్ సినిమాలకు ఉన్న క్రేజ్ని క్యాష్ చేసుకుంటోంది టాలీవుడ్. హిందీ ప్రేక్షకులకు ఏమాత్రం తెలియని “కార్తికేయ 2” హిందీ బెల్ట్లో అత్యధిక వసూళ్లు రాబట్టింది. ఆర్ఆర్ఆర్, పుష్ప లాంటి సినిమాలు మంచి కలెక్షన్లు సాధించాయి. దీంతో నిర్మాతలు రాధాకృష్ణ, నాగ వంశీ, దర్శకుడు త్రివిక్రమ్ కూడా హిందీ వైపు చూస్తున్నారు. వారు తమ తదుపరి చిత్రాన్ని మహేష్ బాబు (SSMB28)తో హిందీలో విడుదల చేయాలనుకుంటున్నారు. మహేష్ బాబు పాన్-ఇండియన్ ప్రేక్షకులకు చాలా సుపరిచితుడు.
పాన్-ఇండియన్ మార్కెట్ను లక్ష్యంగా చేసుకోవడానికి త్రివిక్రమ్కు ఇదే సరైన సమయమని నిర్మాతలు భావిస్తున్నారు. అయితే మహేష్ బాబు ఆసక్తి చూపడం లేదు. అతను రాజమౌళి సినిమాతో పాన్-ఇండియాకు వెళ్లాలనుకుంటున్నాడు. భారతీయ సినిమాలో చాలా మంది సూపర్ స్టార్లను పాన్ ఇండియా హీరోలుగా ఇంట్రడ్యూస్ చేసిన రాజమౌళి వైపు మహేశ్ ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి సినిమాతో హిందీలో అరంగేట్రం చేస్తే అది సేఫ్ లాంచ్ అవుతుందని మహేశ్ నమ్మకం. దీంతో త్రివిక్రమ్ తో కంటే రాజమౌళి సినిమాతో పాన్ ఇండియా హీరోగా లాంచ్ అవ్వాలని అనుకుంటున్నాడు టాలీవుడ్ ప్రిన్స్.