Varun Tej & Lavanya: ఇటలీలో వరుణ్, లావణ్య పెళ్లి, హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షెన్

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మొదటిసారిగా 2017లో వచ్చిన ‘మిస్టర్’ సినిమా సెట్స్ లో లావణ్యను కలిశాడు.

  • Written By:
  • Updated On - August 1, 2023 / 11:47 AM IST

టాలీవుడ్ నటుడు వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి ఇటలీలో వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. టాలీవుడ్ కొత్త జంట ఒక గ్రామీణ వేదికలో కొద్దిమంది ఇష్టమైన వ్యక్తుల మధ్య వివాహాన్ని జరుపుకోనున్నట్లు సమాచారం. దీనికి సన్నాహాలు జరుగుతున్నాయి. కేవలం 50 మంది అతిథులతో ఇటలీలో వివాహం జరగనుంది. ఆ తర్వాత వరుణ్ మరియు లావణ్య హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్‌ను నిర్వహిస్తారు. ఇటలీకి పరిశ్రమలోని వారి స్నేహితులను, రాజకీయ మరియు పారిశ్రామిక పెద్దలను కూడా ఆహ్వానిస్తారు. వరుణ్ ప్రైవేట్ వ్యక్తి కావడంతో, ఆచార వ్యవహారాలు ఫొటోలకు  దూరంగా ఉండాలని కోరుకుంటున్నారు.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మొదటిసారిగా 2017లో వచ్చిన ‘మిస్టర్’ సినిమా సెట్స్ లో లావణ్యను కలిశాడు. అప్పుడే వీరికి పరిచయం ఏర్పడింది. షూటింగ్ సమయంలోనూ ఈ జంట సన్నిహితంగానే మెలిగేదట. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారి తర్వాత ప్రేమగా మారిందట. అప్పటి నుంచే డేటింగ్ లో ఉన్నా కూడా ఈ విషయాన్ని రహస్యంగాను ఉంచింది ఈ జంట. తర్వాత ‘అంతరిక్షం’ సినిమాతో మళ్లీ కలిసి నటించారు వరుణ్-లావణ్య.

ఈ సినిమా టైమ్ లోనే వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు కూడా బయటకు వచ్చాయి. ఇక తర్వాత ఇద్దరూ ప్రయివేట్ పార్టీలలో కూడా కలిసి కనిపించారు. విశేషమేమిటంటే వరుణ్ చెల్లెలు నిహారిక వివాహానికి హాజరైన అతి కొద్ద మంది సన్నిహితుల్లో లావణ్య కూడా ఉంది. దీంతో వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకుంటున్నారు అని వార్తలు మొదలైయ్యాయి.

Also Read: Errabelli: సీఎం కెసిఆర్, BRS పార్టీయే ప్రజలకు శ్రీరామ రక్ష- మంత్రి ఎర్రబెల్లి