Tollywood: తల్లి పాత్రలకు సై అంటున్న బ్యూటీలు, హద్దులు చెరిపేస్తున్న హీరోయిన్లు

ఒకప్పుడు ఏ యువ నటి అయినా తెరపై తల్లి పాత్రను అంగీకరించడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునేవాళ్లు.

  • Written By:
  • Updated On - November 20, 2023 / 12:45 PM IST

Tollywood: ఒకప్పుడు ఏ యువ నటి అయినా తెరపై తల్లి పాత్రను అంగీకరించడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునేవాళ్లు. కానీ మారుతున్న ట్రెండ్ కు అనుగుణంగా మన హీరోయిన్స్ సైతం అప్డేట్ అవుతున్నారు. తల్లి పాత్రలకు సై అంటూ తమదైన ముద్ర వేస్తున్నారు. కీర్తి సురేష్, శ్రద్ధా శ్రీనాథ్, ప్రియమణి లాంటి హీరోయిన్స్ తెరపై తల్లి పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఒకవైపు గ్లామరస్ రోల్స్ చేస్తూనే, మరోవైపు కథనాయిక ప్రాధాన్య పాత్రలతో మెప్పిస్తున్నారు. “కీర్తి ‘పెంగ్విన్’ అనే సినిమా నటించి ఆకట్టుకుంది. కథ గురించి చాలా ఎగ్జైట్ అయ్యి, తల్లి పాత్రను పోషించడానికి అంగీకరించింది. ఒక గర్భిణీ స్త్రీ చుట్టూ తిరిగే ప్రత్యేకమైన థ్రిల్లర్ ‘పెంగ్విన్’ మూవీలో నటించింది ఈ బ్యూటీ.

‘జెర్సీ’లో చురుకైన తల్లిగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న మరో ప్రతిభావంతులైన నటి వెంకటేష్ సరసన ‘సైంధవ్’ చిత్రంలో మళ్లీ తల్లి పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ట్రైలర్ చాలా హైప్ క్రియేట్ చేసింది. అయితే శ్రద్ధ తల్లితో తెలుగులోకి ప్రవేశించడానికి ఇష్టపడలేదు. వాస్తవానికి, పదేళ్ల పాపకు తల్లిగా నటించడానికి ఆమెను ఒప్పించడానికి చాలా సమయం పట్టింది. సినిమా విడుదల అయ్యాక ఆమె నటన హైలైట్‌ గా నిలిచింది. మంచి మార్కులు పడ్డాయి. ప్రియమణి కూడా పలు వెబ్ సీరిస్ లలో తల్లి పాత్రల్లో నటించి ఆకట్టుకుంది.

ఇక కాజల్ అగర్వాల్, తమన్నా, అనుష్క శెట్టి వంటి 30-ప్లస్ నటీమణులు ఇప్పటికీ లవర్స్ పాత్రలు పోషించడానికి, హీరోలతో రొమన్స్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అందంగా మరియు ఫిట్‌గా కనిపించే హీరోయిన్లు రొమాంటిక్ చిత్రాలను ఎంచుకుంటున్నారు. సుహాసిని, రాధిక వంటి నటీమణులు అన్ని రకాల పాత్రలు చేస్తున్నా.. కీర్తి సురేష్, శ్రద్ధా శ్రీనాథ్ వంటి యంగ్ జనరేషన్ హీరోయిన్లు యంగ్ మామ్ పాత్రలు చేయడం ఇష్టంగా ఫీల్ అవుతున్నారు.

Also Read: Shiva Abhishekam: శివుడికి అభిషేకం చేస్తే కలిగే శుభాలివే..