M.S.Subbalakshmi Biopic : వెండితెర సుబ్బలక్ష్మి ఎవరు.. రేసులో ఆ ముగగ్గురు భామలు..!

M.S.Subbalkshmi Biopic ఇప్పటికే ఎంతోమంది మహామహుల జీవిత కథలు వెండితెర మీద ఆవిష్కరించగా ఇప్పుడు ప్రముఖ గాయని, సంగీత కళాకారిణి, నటి ఎం.ఎస్ సుబ్బలక్ష్మి గారి జీవిత కథను

  • Written By:
  • Publish Date - May 23, 2024 / 05:55 PM IST

M.S.Subbalkshmi Biopic ఇప్పటికే ఎంతోమంది మహామహుల జీవిత కథలు వెండితెర మీద ఆవిష్కరించగా ఇప్పుడు ప్రముఖ గాయని, సంగీత కళాకారిణి, నటి ఎం.ఎస్ సుబ్బలక్ష్మి గారి జీవిత కథను తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ దర్శక నిర్మాతలు ఎవరన్నది తెలియదు కానీ సుబ్బలక్ష్మి పాత్రలో ఎవరిని తీసుకోవాలి అన్న చర్చ మాత్రం జరుగుతుంది.

అయితే అందరు కూడా మహానటి సినిమాతో మెప్పించిన కీర్తి సురేష్ అయితే ఆ పాత్రకు పర్ఫెక్ట్ అని అనుకుంటున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన మహానటి సినిమాలో కీర్తి సురేష్ అభినయం గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఆ సినిమా రిఫరెన్స్ తీసుకుంటే మాత్రం ఎం.ఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ లో కీర్తి సురేష్ లాక్ అయినట్టే. అయితే కీర్తి సురేష్ ఒకవేళ కుదరకపోతే మాత్రం మరో ఇద్దరు హీరోయిన్స్ ఆ పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరోయిన్స్ నయనతార, త్రిష ఈ ఇద్దరు కూడా ఎం.ఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ లో నటించే ఛాన్స్ ఉందట.

కుదిరితే నయనతార లేదంటే త్రిష ఎవరో ఒకరు ఫైనల్ అవుతారని టాక్. సో ఎం.ఎస్ సుబ్బలక్ష్మిగా ఈ ముగ్గురిలో ఎవరు ఫిక్స్ అవుతారన్నది త్వరలో తెలుస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార కెరీర్ కాస్త వెనకపడినట్టు అనిపిస్తుండగా ఎం.ఎస్ సుబ్బలక్ష్మి జీవిత కథతో తిరిగి ఫాం లోకి రావాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.

Also Read : Mrunal Thakur : సీతామహాలక్ష్మిపై కన్నేసిన భన్సాలి.. ఆమె కోసం ప్రత్యేకంగా నిర్మాతగా మారి..!