Ambajipeta Marriage Band: అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్‌ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచో తెలుసా?

  • Written By:
  • Updated On - February 24, 2024 / 09:02 AM IST

తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేతిలో నాలుగు ఐదు సినిమాలు ఉన్నాయి. కలర్ ఫోటో సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకున్న సుహాస్ ఒకవైపు హీరోగా నటిస్తూనే మరొకవైపు నెగిటివ్ పాత్రలు చేస్తూ టాలెంటెడ్ యాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే సుహాస్ గత ఏడాది రైటర్ పద్మభూషణ్ సినిమాతో మరొక హిట్టును తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే.

అలా ఈ మధ్యనే అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుహాస్‌. కొత్త డైరెక్టర్ దుష్యంత్ కటికనేని తెరకెక్కించిన ఈ విలేజ్ ఎమోషనల్ డ్రామాలో శివాని నగరం హీరోయిన్‌ గా నటించింది. అలాగే ఫిదా ఫేమ్‌ శరణ్యా ప్రదీప్‌ మరో కీలక పాత్ర పోషించింది. జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్‌ సినిమాను నిర్మించాయి. ఇటీవలె ఫిబ్రవరి 2న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. అలాగే హీరోగా సుహాస్ కు హ్యాట్రిక్ సక్సెస్ ఇచ్చింది.

 

థియేటర్లలో ఆడియెన్స్ ను మెప్పించిన అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ ఆహా సుహాస్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై కీలక అప్ డేట్ ఇచ్చింది ఆహా. మల్లిగాడు మాయా ప్రపంచంలోకి అడుగు పెట్టండి అంటూ అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాను త్వరలో ఓటీటీ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా సంస్థ ట్వీట్‌ చేసింది. అయితే, ఓటీటీ రిలీజ్ డేట్ మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మొన్నటి వరకు మార్చి 8 న లేదా మార్చి 15న అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ సినిమాను స్ట్రీమింగ్‌ చేస్తారని టాక్ నడిచింది. అయితే ప్రస్తుతం ఉన్న బజ్ ప్రకారం మార్చి 1 నుంచి అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ మోగనుంది.