SSMB29: అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎస్.ఎస్. రాజమౌళి-మహేష్ బాబుల ప్రాజెక్ట్ ‘SSMB29’ నిర్మాతలు (SSMB29) అభిమానులకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమా నుంచి మొదటి పాటను ఆన్లైన్లో విడుదల చేశారు. ఈ సింగిల్కు ‘గ్లోబ్ట్రాటర్’ (Globetrotter) అని పేరు పెట్టారు. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా టైటిల్ కూడా ఇదే అయి ఉంటుందని తెలుస్తోంది.
ఈ ‘గ్లోబ్ట్రాటర్’ పాటకు ప్లేబ్యాక్ సింగర్గా నటి శృతి హాసన్ తనదైన శక్తిమంతమైన గాత్రాన్ని, రాక్-ఆధారిత స్వరాన్ని అందించారు. ఎం.ఎం. కీరవాణి కూడా తన సంగీతంతో ఆశ్చర్యపరిచారు. ఈ పాట మొదట్లో కనీస వాయిద్యాలతో కూడిన మంత్రముగ్ధులను చేసే కంపోజిషన్తో వినిపిస్తూ.. ఆ తర్వాత అర్బన్ టచ్ని సొంతం చేసుకుని, ఆపరేటిక్ టోన్తో కూడిన గీతంగా మారుతుంది. ఈ పాటకు చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించారు.
Also Read: CSK Cricketer: నటిని పెళ్లి చేసుకోబోతున్న సీఎస్కే మాజీ ఆటగాడు!
శృతి హాసన్ ప్రత్యేక అనుభవం
అయితే శృతి హాసన్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఎం.ఎం. కీరవాణితో కలిసి పనిచేసిన అనుభవం గురించి హృదయపూర్వక నోట్ను పంచుకున్నారు. ఆమె ఇలా రాశారు. “కీరవాణి గారి మ్యూజికల్లో పాడటం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇది ఎంత శక్తివంతమైన ట్రాక్… గ్లోబ్ట్రాటర్ అదరగొట్టాలి! నేను కీస్పై కూర్చుని సార్ వాయించడం ప్రశాంతంగా వింటున్నాను. ఆయన సాధారణంగా సెషన్స్ ప్రారంభించడానికి ముందు విఘ్నేశ్వర మంత్రాన్ని ప్లే చేస్తారని చెప్పారు. అందుకే ఆయన దాన్ని ప్లే చేస్తున్నారేమో అనుకున్నాను. అకస్మాత్తుగా, అది అప్పా గారి కొడుకు (కీరవాణి గారి కొడుకు) అని గ్రహించాను! ఆ క్షణం చాలా ప్రత్యేకం. మీ దయకు, ఆ రోజు మొత్తం టీమ్ చూపించిన ప్రేమకు, ఆప్యాయతకు ధన్యవాదాలు సార్” అని పేర్కొంది.
ఈ సింగిల్ విడుదల సందర్భంగా ఒక కొత్త పోస్టర్ కూడా వచ్చింది. ఈ పోస్టర్లో మహేష్ బాబు ఒక పొడి నేల (బారన్ ల్యాండ్), బహుశా ఆఫ్రికా ప్రాంతం మధ్యలో నిలబడి హోరిజోన్ వైపు చూస్తున్నట్లు సిల్హౌట్ (silhouette) చిత్రంలో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ కూడా ‘గ్లోబ్ట్రాటర్’ నే సినిమా అధికారిక టైటిల్గా పరోక్షంగా ధృవీకరిస్తోంది.
ఇతర నటీనటుల వివరాలు
ఈ వారం ప్రారంభంలోనే SSMB29 నిర్మాతలు తమ సినిమాలో ప్రధాన పాత్రల కోసం ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్లను ఎంపిక చేసినట్లు ప్రకటించారు. అదే సమయంలో పృథ్వీరాజ్ పాత్ర ‘కుంభ’ ను అద్భుతమైన క్యారెక్టర్ పోస్టర్ ద్వారా పరిచయం చేశారు. SSMB29 బృందం తమ సినిమా ఫస్ట్ గ్లింప్స్ను నవంబర్ 15న ఆవిష్కరించేందుకు భారీ కార్యక్రమాన్ని కూడా ప్లాన్ చేసింది.
