Dhanush: మరోసారి రెమ్యూనరేషన్ ని పెంచేసిన ధనుష్.. ఎన్నో కోట్లో తెలుసా?

  • Written By:
  • Publish Date - March 30, 2024 / 10:00 AM IST

తెలుగు సినీ ప్రేక్షకులకు తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమిళం తో పాటు తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు ధనుష్. సినిమా హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఆయన నటించిన కొన్ని తమిళ సినిమాలు తెలుగు లోకి విడుదల అయిన విషయం తెలిసిందే. క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌తో పాటు కొత్త త‌ర‌హా సినిమాలు చేయ‌డంలో ఆయ‌న ముందుంటారు. తాజాగా త‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఒక సినిమాలో న‌టిస్తున్నారు.

ధ‌నుష్ కెరీర్‌లో 50వ సినిమాగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇటీవల ఆ సినిమాకు రాయన్ అనే టైటిల్ ను కూడా ఖరారు చేసారు. ఇదే విష‌యాన్ని తెలుపుతూ ధ‌నుష్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను విడుద‌ల చేశారు. తర్వాత ధనుష్ కుబేర అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ధనుష్ సరసన రష్మిక మందన నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. దీనితో పాటు ధనుష్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కూడా చివరిదశ షూటింగ్ కు వచ్చింది. ఇక ఈమూవీకి జివి ప్రకాష్ సంగీతం అందించారు. ధనుష్ నటిస్తున్న సినిమాల జాబితాలలోకి మరో సినిమా కూడా చేరింది. తాజా చిత్రం ఇళయరాజా బయోపిక్.

ఈ చిత్రంలో ఇళయరాజాగా నటించేందుకు నటుడు ధనుష్ కమిట్ అయ్యాడు. ఈ చిత్రానికి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. సంగీత విద్వాంసుడు ఇళయరాజా జీవితం ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి కమల్ హాసన్ దర్శకత్వం వహించనున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా పనులు పూజా కార్యక్రమాలతో మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు నటుడు ధనుష్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడనే సమాచారం లీక్ అయింది. రెండు భాగాలుగా రూపొందనున్న ఈసినిమాలో నటించేందుకు.. ధనుష్ ఒక పార్ట్ కు 50 కోట్లు, రెండు పార్ట్ లకు రూ.100 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. నటుడు ధనుష్ తన మునుపటి చిత్రం కెప్టెన్ మిల్లర్ కోసం 30 కోట్లు తీసుకోగా.. ఇప్పుడు ఈ రేటును అమాంతం పెంచేసినట్టు తెలుస్తోంది.