సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె మనవరాలు, మహేష్ బాబు కూతురు సితార తట్టుకోలేకపోయింది. ఇందిరాదేవి భౌతికకాయం వద్ద మహేష్ మోకాళ్లపై కూర్చొని నానమ్మను తలుచుకుంటూ వెక్కివెక్కి ఏడ్చింది. మహేష్ బాబు ఆమెను ఏంత ఓదార్చినా సితార ఏడుపు మాత్రం ఆపలేకపోయాడు. సితార ఏడుస్తుండటంతో మహేష్ కూడా ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నాడు.
నానమ్మ అంటే సితారకు ఎంతో ప్రేమ అని, ఇందిరా దేవిని చూడటానికి తరుచూ వెళ్తుండేదని సన్నిహితులు తెలిపారు. నానమ్మ మరణవార్తను సితార తట్టుకోలేకపోయిందని అంటున్నారు. ఇకపోతే సూపర్ స్టార్ మహేష్బాబు కుటుంబంలో ఓకే ఏడాది రెండు విషాదాలు చోటుచేసుకున్నాయి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరాదేవి బుధవారం తుది శ్వాస విడిచారు. ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలిసినప్పటి నుంచే ఘట్టమనేని వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ ఏడాది జనవరిలోనే మహేష్ సోదరుడు రమేష్ బాబు కూడా అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో ఒకే ఏడాదిలో సూపర్ స్టార్ ఇంట్లో రెండు విషాదాలు చోటుచేసుకున్నాయి. ఇందిరాదేవికి మొత్తం ఐదుగురు సంతానం. రమేష్ బాబు, మహేష్ బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని.. ఇందిరాదేవి సంతానమే. రమేష్ బాబు 8 నెలల కిందట మరణించారు. అతడు మరణించిన తర్వాత.. నేడు ఇందిరాదేవి కన్నుమూశారు. దీంతో సూపర్ స్టార్ కుటుంబంలో పెను విషాదం నెలకొంది.