Athadu: అతను సినిమాలో నటించిన ఈ బుడ్డోడు గుర్తున్నాడా.. ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా?

  • Written By:
  • Publish Date - February 18, 2024 / 11:30 AM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతడు సినిమా గురించి మనందరికీ తెలిసిందే. 2005లో విడుదలైన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన త్రిష నటించింది. ఇకపోతే ఈ సినిమాలో త్రిష రొమాన్స్ ఎంత బాగుంటుందో కమెడియన్ బ్రహ్మానందం కామెడీ అంతకంటే అద్భుతంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ సినిమా ఇప్పటికీ విడుదల అయినా కూడా టీవీలకు అతుక్కుపోయి చూసే వారు చాలామంది ఉన్నారు. ఈ సినిమాను రీ రిలీజ్ చేసినా కూడా మంచి రిజల్ట్ వచ్చింది. బోర్‌ కొట్టినప్పుడల్లా యూట్యూబ్‌లో అతడు సినిమా చూసి, నవ్వుకునే వారు లక్షల్లో ఉన్నారు. ఆ కామెడీ సీన్స్ ఇప్పటి రీల్స్, షార్ట్స్ రూపంలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

ఆ మూవీలో కామెడీ అలా ఉంటుంది. అయితే అతడు చిత్రంలో బ్రహ్మానందం కుమారుడిగా నటించిన బుడ్డోడు మీకు గుర్తున్నాడా? సినిమాలో బ్రహ్మానందం మహేష్ బాబు ఇంటికి రాగానే.. ఒక బుడ్డోడు వచ్చి.. నాన్నా.. నా కోసం ట్రైన్ తెచ్చావా? అని అడిగుతాడు. తెచ్చాను.. స్టేషన్‌లో ఉంది. వెళ్లి ఆడుకో పో అంటూ బ్రహ్మానందం చెప్పే డైలాగ్ నవ్వులు పూయిస్తుంది. అలా సినిమాలో రెండు మూడు సన్నివేశాలలో ఆ బుడ్డోడు బ్రహ్మానందం కాంబినేషన్లో వచ్చిన కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వేస్తాయి. అయితే మరి అతడు సినిమాలో అంతలా నవ్వించిన ఈ బుడ్డోడు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా? అతడి పేరు దీపక్ సరోజ్.

అతడు సినిమా కంటే ముందు ఆర్య, పౌర్ణమి, భద్ర వంటి సినిమాల్లో కూడా నటించాడు. ఆ తర్వాత మిణుగురులు, లెజెండ్ చిత్రాల్లోనూ మెరిశాడు. కానీ అతడు సినిమాలో క్యూట్‌గా డైలాగ్‌లు చెప్పిన పిల్లాడు.. ఇప్పుడు హీరో అయ్యాడు. సిద్దార్థ్ రాయ్ అనే సినిమాలో నటించాడు. ఇప్పటికే విడుదలైన సినిమా ట్రైలర్‌కు, పాటలకు మంచి స్పందన వస్తోంది. ఇందులో దీపక్‌కు జోడీగా తన్వినేగి నటించింది. హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి పెద్ద దర్శకుల వద్ద పనిచేసిన వి యశస్వీ సిద్దార్థ్ రాయ్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 23న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. ఈ ప్రమోషన్స్ లో బాగానే ఇటీవలే బ్రహ్మానందం ఇంటికి వెళ్లి హాయ్ నాన్న నన్ను గుర్తుపట్టావా అంటూ బ్రహ్మానందంతో కాసేపు కామెడీ చేసి ఆయనతో ముచ్చటించారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.