Karuppu: సూర్య కరుప్పు కు షాక్.. మార్నింగ్‌ షోలు రద్దు

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘కరుప్పు’ చిత్రానికి విడుదల రోజున ఊహించని అడ్డంకి ఎదురైంది. ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం, మే 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడింది. దీంతో ఈరోజు ఉదయం ప్రదర్శితం కావాల్సిన ఎర్లీ మార్నింగ్ షోలు రద్దయ్యాయి. ఆర్థికపరమైన సమస్యల కారణంగానే ఈ సినిమా విడుదల నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.50 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉండటంతో […]

Published By: HashtagU Telugu Desk
Shock for Surya Karuppu Morning Shows Cancelled

Shock for Surya Karuppu Morning Shows Cancelled

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘కరుప్పు’ చిత్రానికి విడుదల రోజున ఊహించని అడ్డంకి ఎదురైంది. ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం, మే 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడింది. దీంతో ఈరోజు ఉదయం ప్రదర్శితం కావాల్సిన ఎర్లీ మార్నింగ్ షోలు రద్దయ్యాయి.

ఆర్థికపరమైన సమస్యల కారణంగానే ఈ సినిమా విడుదల నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.50 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉండటంతో సినిమాకు ఫైనాన్షియల్ క్లియరెన్స్ లభించలేదని సమాచారం. ఈ సమస్యను పరిష్కరించేందుకు నిర్మాతలు ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ పరిణామంతో భారత్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ ప్రీమియర్ షోలను రద్దు చేశారు. ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫారమ్‌లు షోలను తొలగించి, అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న ప్రేక్షకులకు డబ్బులు తిరిగి చెల్లించే ప్రక్రియను ప్రారంభించాయి. సినిమాపై పాజిటివ్ బజ్ ఉండటంతో భారీ ఓపెనింగ్స్ వస్తాయని భావిస్తున్న తరుణంలో ఈ అవాంతరం ఎదురవ్వడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

“తప్పనిసరి పరిస్థితుల కారణంగా ‘కరుప్పు’ ఉదయం 9 గంటల షోలను రద్దు చేస్తున్నాం. అందరికీ మా క్షమాపణలు” అని నిర్మాత ఎస్‌ఆర్ ప్రభు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మరోవైపు, “నిర్మాతలు సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు” అని దర్శకుడు ఆర్‌జే బాలాజీ పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితితో సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే దానిపై గందరగోళం నెలకొంది.

  Last Updated: 14 May 2026, 10:18 AM IST