OTT Release: ఓటీటీలోకి ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’

శర్వానంద్, రష్మిక జంటగా నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ఇటీవలే థియేటర్లలో విడుదలైంది.

  • Written By:
  • Updated On - March 8, 2022 / 11:23 AM IST

శర్వానంద్, రష్మిక జంటగా నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఓకే అనిపించుకుంది. ఇప్పటికే థియేటర్లలో రన్ అవుతున్న ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు మూవీ మేకర్స్. ఈ మేరకు సోనీలైవ్ త్వరలో ప్రీమియర్‌కు సిద్ధమవుతున్నట్టు టాలీవుడ్ టాక్. సాధారణంగా.. ఏ సినిమా అయినా థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత మాత్రమే ఓటీటీ విడుదలను ప్లాన్ చేస్తారు. అయితే ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ నిర్మాతలు మాత్రం ముందే నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ ఓటీటీ డీల్ కుదిరితే ఈ మూవీ ఏప్రిల్ మొదటివారంలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయి. అయితే ఈ నెలలో ‘రాధే శ్యామ్’, ‘RRR’ వంటి భారీ చిత్రాలు విడుదలకు సిద్ధంకానుండటంతో  ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ నిర్మాతలకు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ దొరకడం కష్టమనే చెప్పాలి. ఈ కారణంతోనే ఈ చిత్ర నిర్మాతలు ముందుగానే ఓటీటీ డీల్ కుదుర్చుకోనున్నట్టు తెలుస్తోంది.