Actress Lakshmi: సీనియర్ నటి లక్ష్మిపై సంచలన వాఖ్యలు చేసిన మాజీ భర్త!

  • Written By:
  • Publish Date - March 14, 2024 / 01:00 PM IST

తెలుగు సినీ ప్రేక్షకులకు సీనియర్ నటి లక్ష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు తెలుగులో ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించిన లక్ష్మి ఆ తర్వాత సహాయనటిగా ఎన్నో సినిమాలలో నటించి మెప్పించింది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మురారి సినిమా నుంచి సమంత కనిపించిన బేబి సినిమా వరకు నటనతో అలరించారు లక్ష్మి. అయితే సినిమాల గురించి కాకుండా ఆమె వ్యక్తిగత విషయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు.

తాజాగా ఆమె మాజీ భర్త మోహన్ శర్మ లక్ష్మి పై సంచలన కామెంట్స్ చేశారు. లక్ష్మీ, మోహన్ శర్మ చాలా సినిమాల్లో కలిసి నటించారు. 1975లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ వారి మధ్య మనస్పర్థలు రావడంతో 1980లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత లక్ష్మి డైరెక్టర్ శివచంద్రన్ ను రెండో పెళ్లి చేసుకుంది. ఇన్నాళ్లు సైలెంట్‏గా ఉన్న ఆమె మాజీ భర్త మోహన్ శర్మ ఇప్పుడు షాకింగ్ కామెంట్స్ చేశాడు. లక్ష్మితో ప్రేమ, పెళ్లి, విడాకుల గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. ఈ సందర్బంగా మోహన్ శర్మ మాట్లాడుతూ.. నేను, లక్ష్మి కలిసి చాలా సినిమాల్లో నటించాము. కానీ లక్ష్మి నన్ను ఇష్టపడుతుందని నాకు తెలియదు.

ఒకరోజు నాతో షాపింగ్‌కి వస్తావా అని నటుడు మోహన్‌ని లక్ష్మి అడిగిందట. వాళ్లు చెప్పిన ప్రతిచోటా తీసుకెళ్లి షాపింగ్ చేశాను. అప్పుడు ఒక పర్ఫ్యూమ్ బాటిల్ కొనాలనుకున్నాను. కానీ దాని ధర రూ.500. అప్పట్లో నా దగ్గర అంత డబ్బు లేదు. కానీ ఆ తర్వాత అదే బాటిల్ నాకు బహుమతిగా ఇచ్చింది లక్ష్మి. అప్పుడే నాకు ప్రపోజ్ చేసింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం. మీ జీవితంలో నాకు అవకాశం ఇస్తే నేను మీ కుక్కలా ఉంటాను అని చెప్పింది. దీంతో ఆమె మాటలు విని షాకయ్యాను. మొదటిసారి ఒక అమ్మాయి నాకు ప్రేమను తెలపడం. అయితే లక్ష్మి మాటలను చాలా సీరియస్‌గా తీసుకున్నాను. ఆ రాత్రి నాకు నిజంగా నిద్ర పట్టలేదు. లక్ష్మి మరుసటి రోజు ఫోన్ చేసి రూమ్ కి రండి అని పిలిచింది. నేను నేరుగా హోటల్ గదికి వెళ్ళాను. ఇద్దరం పెళ్లి చేసుకుందామా? అడిగింది లక్ష్మి. ప్రస్తుతం నేను నా కెరీర్‌పై దృష్టి పెట్టాలి. పెళ్లి గురించి ఆలోచించడం లేదని చెప్పాను. నేను గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చాను. అందుకే ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాను.

వెంటనే ఆమె నుదుటిపై కుంకుమ రాశాను. ఆ రాత్రి మేమిద్దరం భార్య భర్తలమయ్యాము.. చెన్నైకి వచ్చి లాయర్ ద్వారా మా పెళ్లి గురించి మీడియాకు తెలియజేశాం అని చెప్పుకొచ్చారు. లక్ష్మి ఎన్నో తప్పులు చేసింది. తన తల్లి గురించి ఆమె కూతురు ఐశ్వర్య అన్ని విషయాలు నాతో చెప్పింది. దాంతో తల్లి కూతురి మధ్య తీవ్రంగా గొడవలు జరిగాయి. కూతురితో అలా ప్రవర్తిస్తావా అని వారించినందుకు నన్ను ఇష్టానుసారంగా మాట్లాడింది. ఆ తర్వాత ఆమె ప్రవర్తన నచ్చక విడాకులు తీసుకున్నాను అని మోహన్ శర్మ చెప్పుకొచ్చారు.