Site icon HashtagU Telugu

Sankranthiki Vasthunam : ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’..

Sankrantiki Vastunnam

Sankrantiki Vastunnam

Sankranthiki Vasthunam : ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత విక్టరీ వెంకటేశ్ , అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరెక్కిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. వెంకటేశ్, ఐశ్వర్య, మీనాక్షిల నటనతో పాటు బుల్లిరాజు కామెడీ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సినిమా విడుదలయ్యాక, ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించి, ‘సంక్రాంతికి వస్తున్నాం’ రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే, ఈ చిత్రం ఓవర్సీస్‌లో కూడా పెద్ద సక్సెస్ సాధించింది.

Anchor Rashmi : కింగ్‌ నాగార్జునకు యాంకర్ రష్మీ గౌతమ్ స్పెషల్‌ రిక్వెస్ట్‌

అయితే, ఈ సినిమా ఓటీటీలో కూడా ప్రసారం అయ్యే ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. జీ5 సంస్థ ఈ చిత్రానికి డిజిటల్ , షాట్లైట్ రైట్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ చిత్రాన్ని ఓటీటీలోకి విడుదల చేసే కంటే ముందుగా టీవీలో టెలికాస్ట్ చేయాలని నిర్ణయించబడినట్లు తెలుస్తోంది. జీ5 సంస్థ ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించి, ‘త్వరలోనే సంక్రాంతికి వస్తున్నాం సినిమా టీవీలోకి వస్తోంది’ అంటూ వీడియోలు విడుదల చేసింది.

ఈ క్రమంలో, జీ5 సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్టును షేర్ చేసింది. ‘ఏమండోయ్.. వాళ్లు వస్తున్నారు. మరిన్ని వివరాలు, కూసంత చమత్కారం కోసం వేచి చూడండి. త్వరలోనే మరిన్ని వివరాలను ప్రకటిస్తాం’ అనే మాటలను జీ5 రాసింది. దీనికి ‘సంక్రాంతికి వస్తున్నాం క‌మింగ్ సూన్’ అనే హ్యాష్‌ట్యాగ్ జోడించడంతో, త్వరలోనే ఓటీటీ విడుదల తేదీని ప్రకటించేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక, టీవీ కంటే ముందుగా ఓటీటీ విడుదల వస్తుందా లేదా టీవీ ప్రాధాన్యత పొందుతుందా అనే విషయం అంగీకరించాల్సి ఉంది.

‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ వసూళ్లు సాధించడంలో విజయం సాధించడంతో, ఓటీటీ లేదా టీవీ విడుదలపై ఆసక్తి ఇంకా పెరుగుతోంది.

Chahal- Dhanashree: విడిపోయిన చాహ‌ల్‌- ధ‌న‌శ్రీ వ‌ర్మ‌.. కార‌ణం కూడా వెల్ల‌డి!