నాకు ఎవ్వరితోనూ అఫైర్స్ లేవు.. అబార్షన్ కూడా చేయించుకోలేదు!

టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ సమంత, చైతూ విడిపోయిన సంగతి తెలిసిందే. విడిపోతున్నట్టు ప్రకటించి వారం రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ సమంత గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న రూమర్స్ పై సమంత రియాక్ట్ అయ్యింది.

  • Written By:
  • Updated On - October 9, 2021 / 04:10 PM IST

టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ సమంత, చైతూ విడిపోయిన సంగతి తెలిసిందే. విడిపోతున్నట్టు ప్రకటించి వారం రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ సమంత గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న రూమర్స్ పై సమంత రియాక్ట్ అయ్యింది. ముఖ్యంగా సామ్‌ పిల్లల్ని కనడానికి ఇష్టపడలేదని.. ఇప్పటికే రెండు సార్లు అబార్షన్‌ చేయించుకుందని.. పిల్లల్ని కంటే కెరీర్‌కు అడ్డుగా మారుతుందని భావించిందని.. ఈ విషయం చైతన్యకు నచ్చకనే ఇద్దరు విడిపోయారనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. పిల్లల విషయంలో నాగ్‌ కుటుంబం సమంతకు ఎంతో నచ్చచెప్పిందని.. కానీ ఆమె వినలేదనే వార్తలు కూడా వెలువడ్డాయి.

ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఈ పుకార్లపై సమంత తొలిసారి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించారు. తాను అబార్షన్‌ చేయించుకున్నానే వార్తల్ని ఖండించారు. ఈ క్రమంలో సామ్‌ ఇన్‌స్టాలో ఓ స్టోరీ షేర్‌ చేశారు. ‘‘ఇలాంటి కఠిన సమయంలో మీరు చూపిన ఆదరణకు ధన్యవాదాలు. నాకు మద్దతుగా నిలిచి.. నాపై వచ్చిన అబద్దపు వార్తలని ఖండించారు. ‘వాళ్లు’ నాకు వేరే వాళ్లతో అఫైర్స్‌ ఉన్నాయని.. నేను పిల్లల్ని కనడానికి ఇష్టపడలేదని.. అబార్షన్‌ చేయించుకున్నానని.. నేను అవకాశవాదినని ఇలా రకరకాల వార్తలు ప్రచారం చేశారు.

‘‘కానీ విడాకులు తీసుకోవడం అనేది అత్యంత బాధాకరమైన అంశం. దీన్నుంచి బయటపడటానికి సమయం పడుతుంది. ఇలాంటి సమయంలో నాపై వ్యక్తిగతంగా ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం తగదు. అయితే ఒక్క విషయం చెప్పదల్చుకున్నాను.. ఈ తప్పుడు ప్రచారం నన్ను ఏమాత్రం కుంగదీయలేదు’’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేశారు. అయితే చైతూతో విడాకులు తీసుకున్న స‌మంత కొన్ని రోజుల వ‌ర‌కు మీడియాకు దూరంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే షూటింగ్‌ల‌కు హాజ‌ర‌వుతున్నారు. రీసెంట్‌గానే ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘ఎవ‌రు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమంలో పాల్గొని స‌మంత పాతిక ల‌క్షలను గెలుచుకోడం విశేషం.