టాలీవుడ్ బ్యూటీ సమంత మరోసారి హాట్ టాపిక్ గా మారింది. నాగచైతన్యతో ఎప్పుడైతే బ్రేకప్ చెప్పిందే, అప్పట్నుంచే ప్రతిరోజు ఏదో విషయమై చర్చనీయాంశమవుతూనే ఉంది. టూర్స్, సినిమాలు, పార్టీలు, స్నేహితుల గురించి పోస్టులు పెడుతూ బజ్ క్రియేట్ చేస్తోంది. ఇక పుష్ప ఐటం సాంగ్ తో ఒక్కసారిగా తన క్రేజ్ ను అమాంతం పెంచేసింది. అయితే, నాగ చైతన్యతో విడిపోవడానికి ముందు సమంత నివసించే అదే ఇంటిని ఎలా కొనుగోలు చేసింది అనే దానిపై క్లారిటీ ఇచ్చాడు సీనియర్ నటుడు మురళి మోహన్. పెళ్లి చేసుకున్న తర్వాత హైదరాబాద్ లో తమ ఇంటిని కొనుగోలు చేయడంలో సమంత ఎలా మొండిగా వ్యవహరించిందో సినీయర్ నటుడు మురళి మోహన్ ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ కామెంట్స్ చేశాడు.
వివాహానంతరం నాగ చైతన్య, సమంతలు మా అపార్ట్మెంట్లోనే ఉంటున్నారని మురళి మోహన్ తెలిపారు. “వారు కొత్త ఇల్లు సిద్ధమైన తర్వాత దానిని అప్పగిస్తామనే షరతుతో ఈ అపార్ట్మెంట్ను విక్రయించాం. ఇంతలోనే ఈ జంట విడాకులు తీసుకున్నారు. అయితే ఈ అపార్ట్మెంట్ తనకు బాగా సరిపోతుందని సమంత భావించింది. సమంత అదే అపార్ట్మెంట్పై పట్టుబట్టడంతో కాదలేకపోయాను’’ అన్నారు మురళి మోహన్. సమంత, ఆమె తల్లి ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉంటున్నారని మురళి మోహన్ తెలిపారు.