బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ గురించి మనందరికీ తెలిసిందే. సల్మాన్ ఖాన్ తమ్ముడిగా, నటుడిగా అర్భాజ్ ఖాన్ మనందరికీ సుపరిచితమే. అర్బాజ్ ఖాన్ బాలీవుడ్ సినిమాలతో పాటు గతంలో టాలీవుడ్ సినిమాలలో కూడా నటించిన విషయం తెలిసిందే. జై చిరంజీవ, కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త లాంటి సినిమాలలో నటించి అలరించారు అర్బాజ్ ఖాన్. ఇది ఇలా ఉంటే దాదాపుగా ఏడేళ్ల తర్వాత మళ్లీ తెలుగు సినిమా ప్రేక్షకులను పలకరించబోతున్నారు అర్బాజ్ ఖాన్. మరి ఆ వివరాల్లోకి వెళితే..
మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1గా అప్సర్ దర్శకత్వంలో అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశీ జంటగా తెరకెక్కుతున్న సినిమాలో బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో అర్బాజ్ ఖాన్ పోలీసాఫీసర్ గా నటించబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. చాలా సంవత్సరాల తరువాత మళ్ళీ ఒక తెలుగు సినిమాలో నటించడంపై అర్బాజ్ ఖాన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సినిమా నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..
Welcoming the supremely talented @arbaazSkhan garu onboard for our #ProductionNo1 – Team @GangaEnts 💐
Shoot commencing at brisk pace. Stay Tuned for more exciting updates ✨@imashwinbabu @DiganganaS @apsardirector @vikasbadisa @MaheswaraMooli @sahisuresh pic.twitter.com/ht5QcjJAa3
— Ganga Entertainments (@GangaEnts) January 30, 2024
అశ్విన్ బాబు హీరోగా ఒక కొత్త కథతో తెరకెక్కుతున్న సినిమా ఇది. మా గంగా ఎంటర్టైన్మంట్స్ మొదటి నిర్మాణంలోనే అర్బాజ్ ఖాన్ గారితో పని చేయడం సంతోషంగా ఉంది. ఇందులో అర్బాజ్ గారి పాత్ర అద్భుతంగా ఉంటుంది. నేటి నుంచి మొదలైన కొత్త షెడ్యూల్ లో ఆయన సెట్స్ లోకి అడుగుపెట్టారు. సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం అని తెలిపారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మూవీ మేకర్స్ తో అర్బాజ్ ఖాన్ కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇకపోతే అర్బాజ్ ఖాన్ విషయానికి వస్తే.. గత ఏడాది అర్బాజ్ ఖాన్ రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాలతో కూడా బిజీగా ఉన్నాడు.