Saipallavi: ఆ టాక్ షోకు సాయిపల్లవి.. వాటి గురించి సంచలన కామెంట్లు?!

సినిమాల్లో హీరోయిన్లకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. హీరోలతో, సినిమాలతో సంబంధం లేకుండా చాలామంది హీరోయిన్లకు ప్రత్యేకమైన స్టార్ డం ఉంటుంది.

  • Written By:
  • Publish Date - February 2, 2023 / 08:51 PM IST

Saipallavi: సినిమాల్లో హీరోయిన్లకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. హీరోలతో, సినిమాలతో సంబంధం లేకుండా చాలామంది హీరోయిన్లకు ప్రత్యేకమైన స్టార్ డం ఉంటుంది. ఇలా తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్, అభిమానులను సొంతం చేసుకున్న హీరోయిన్ల జాబితాలో.. సాయి పల్లవి ఒకరు. మలయాళ ఇండస్ట్రీ నుండి తెలుగులోకి వచ్చిన సాయిపల్లవి ప్రస్తుతం స్టార్ హీరోయిన్ స్థాయిని సొంతం చేసుకుంది.

‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులందరికి దగ్గరైన హీరోయిన్ సాయి పల్లవి.. సినిమా సినిమాకు తనలోని నటనను మరింత మెరుగుపరుచుకుంటూ అందరినీ ఆకట్టుకుంటోంది. న్యాచురల్ బ్యూటీ క్వీన్ గా పేరున్న సాయి పల్లవి.. ప్రస్తుతం ఏ సినిమా చేయడం లేదు. పైగా సోషల్ మీడియాలో కూడా అమ్మడు అందుబాటులో లేదు. దీంతో సాయి పల్లవి సినిమాలకు గుడ్ బై చెప్పేసిందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

సరిగ్గా ఇదే సమయంలో హీరోయిన్ సాయి పల్లవి ఓ టాక్ షోకు గెస్టుగా వెళ్లింది. త్వరలోనే సోనీ లైవ్ లో ప్రసారం కానున్న సింగర్ స్మిత హోస్ట్ చేస్తున్న షో ‘నిజం విత్ స్మిత’కు సాయి పల్లవి హాజరైంది. సోని లైవ్ లో ఈనెల 10వ తేదీ సాయి పల్లవి ఎపిసోడ్ ప్రసారం కానుంది. అయితే ఈ ఎపిసోడ్ లో వాడివేడిగా సాగినట్లు ప్రచారం నడుస్తోంది. తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో అంచనాలను మరింత పెంచింది.

హీరోయిన్ సాయి పల్లవి చాలా సెన్సిటివ్ విషయాల మీద కూడా రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో చాలాకాలంగా ఉన్న అనేక విషయాల గురించి సాయి పల్లవి పెదవి విప్పినట్లు తెలుస్తోంది. ఫిజికల్ అబ్యూస్ (శారీరక హింస), వర్బల్ అబ్యూస్ (మాటల ద్వారా హింస) అంటూ సాయి పల్లవి సీరియస్ కామెంట్స్ చేయడం వీడియోలో కనిపించింది. దీంతో ఈ ఎపిసోడ్ లో సాయిపల్లవి ఏం చెబుతుందో అనే చర్చ సాగుతోంది.