Site icon HashtagU Telugu

Sai Durgha Tej : కేజీఎఫ్ తరహాలో సాయి దుర్గ తేజ్ కొత్త సినిమా.. మైనింగ్, ప్రీ ఇండిపెండెన్స్..

Sai Durgha Tej Next Movie Story And Title Details Gone Viral

Sai Durgha Tej Next Movie Story And Title Details Gone Viral

Sai Durgha Tej : సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్.. ‘విరూపాక్ష’తో సూపర్ హిట్టుని అందుకున్నారు. ఆ తరువాత మావయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి ‘బ్రో’ అనే సినిమా చేసి మంచి విజయానే నమోదు చేసారు. అయితే ఆ తరువాత సినిమాలకు కొంచెం బ్రేక్ ఇచ్చారు. ఒక చిన్న సర్జరీ కోసం షూటింగ్స్ బ్రేక్ ఇచ్చి చికిత్స తీసుకున్నారు. ఇక ఈ మధ్యలో సంపత్ నందితో ఓ సినిమా అనౌన్స్ చేసినప్పటికీ.. అది ఇప్పటికి పట్టాలు ఎక్కలేదు. ఆ సినిమా ఆగిపోయిందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే, ఈ హీరో హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రొడక్షన్ లో ఓ సినిమాకి ఈ సైన్ చేసారు. ఈ సినిమాని కొత్త దర్శకుడు రోహిత్ తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ ఫిలిం వర్గాల్లో వైరల్ అవుతుంది. ఈ సినిమా కథ కేజీఎఫ్ తరహాలో ఉండబోతుందట. ప్రీ ఇండిపెండెన్స్ టైంలో మైనింగ్ బ్యాక్‌డ్రాప్ తో రాయలసీమ ప్రాంతంలో ఈ సినిమా కథ జరుగుతుందట. ఈ చిత్రానికి ‘సంబరాల ఏటిగట్టు’ అనే టైటిల్ ని పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ మూవీని తెరకెక్కించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేసి షూటింగ్ మొదలు పెట్టనున్నారట. అలాగే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు, కాస్టింగ్ డీటెయిల్స్ గురించి కూడా త్వరలో తెలియజేయనున్నారు.

కాగా సంపత్ నందితో అనౌన్స్ చేసిన ‘గాంజా శంకర్’ సినిమా ఏమైందో తెలియడం లేదు. ఆ మధ్య టైటిల్ విషయంలో పోలీసులు ఈ సినిమాకి నోటీసులు పంపించడంతో.. ఈ ప్రాజెక్ట్ ఇంకా ఉందని తెలిసింది. మరి ఇప్పటికి ఉందా లేదా అనేది క్లారిటీ లేదు.