Sai Dharam Tej : ఆ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్.. మెగా మేనల్లుడి ప్లాన్ అదుర్స్..!

Sai Dharam Tej మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ హీరోగా కిశొర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా చిత్రలహరి. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నివేదా పేతురాజ్

  • Written By:
  • Publish Date - February 23, 2024 / 08:36 PM IST

Sai Dharam Tej మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ హీరోగా కిశొర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా చిత్రలహరి. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నివేదా పేతురాజ్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటించింది. సాయి తేజ్ ఖాతాలో హిట్ సినిమాగా నిలిచిన ఈ సినిమాకు సీక్వెల్ ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. కిశోర్ తిరుమల ఈ సీక్వెల్ కథను సిద్ధం చేశారట. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది.

కిశోర్ తిరుమల చివరగా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా చేశాడు. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోవడంలో విఫలమైంది. అయితే చిత్రలహరి సినిమా సీక్వెల్ ని మెగా ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ కూడా అడుగుతుండగా ఆ కథనే కొనసాగించేలా మరో కథ సిద్ధం చేస్తున్నారట.

నేను శైలజ లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన కిశోర్ తిరుమల నుంచి చిత్రలహరి సీక్వెల్ రావడం ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది.. సినిమా ఎలా ఉండబోతుంది అన్నది చూడాలి. సాయి తేజ్ విరూపాక్ష హిట్ అందుకోగా బ్రో సినిమా జస్ట్ ఓకే అనిపించుకుంది.

Also Read : NTR Devara : దేవరకు సమస్యగా మారిన అతను.. ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ లో టెన్షన్ స్టార్ట్..!