Raviteja Venky మాస్ మహరాజ్ రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్ మూవీ వెంకీ. 2004 లో రిలీజైన ఈ సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయం ఒకటి రీసెంట్ ఇంటర్వ్యూలో శ్రీను వైట్ల చెప్పుకొచ్చారు.
రవితేజ, స్నేహా జంటగా నటించిన వెంకీ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. రవితేజ, బ్రహ్మానందం, ఏవిఎస్, వేణు మాధవ్ ఇలా అందరు కలిసి ఆ ఎపిసోడ్ బ్లాక్ బస్టర్ అయ్యేలా చేశారు.
వెంకీ సినిమా అనగానే అందరికీ ఆ ట్రైన్ ఎపిసోడ్ గుర్తుకొచ్చేలా చేశారు. అయితే శ్రీను వైట్ల ఆ సీన్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఫస్ట్ ఆ సీన్ ఎవరికీ నచ్చలేదట. అసలు వర్క్ అవుట్ అవుతుందా ఆడియన్స్ ఈ సీన్ ని ఎంజాయ్ చేస్తారా అని యూనిట్ అంతా డౌట్ పడ్డారట. శ్రీను వైట్ల మాత్రం ఆ ఎపిసోడ్ బాగుంటుందని చెప్పి అదే కాన్ ఫిడెంట్ తో సినిమాలో ఉంచారట.
తీరా రిలీజ్ అయ్యాక ఆ సీన్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. వెంకీలో ఆ ట్రైన్ ఎపిసోడ్ లాంటి సీన్స్ ఇప్పటికీ ట్రై చేస్తూనే ఉన్నారు. అలా వెంకీ ట్రైన్ ఎపిసోడ్ ఒక బ్రాండ్ సెట్ చేసింది. యూనిట్ మాటలు విని శ్రీను వైట్ల ఆ సీన్ చేయకుండా ఉంటే మాత్రం ఒక మంచి ఎపిసోడ్ మిస్ అయ్యే వాళ్లం. శ్రీను వైట్ల రవితేజ ఇద్దరి కెరీర్ కి వెంకీ ఒక మంచి బూస్టింగ్ ఇచ్చింది.
Also Read : Jhanvi Kapoor: అందుకే తిరుమల శ్రీవారి పై అంత భక్తి.. ఎట్టకేలకు కారణం రివీల్ చేసిన జాన్వీకపూర్!