Rashmika Mandanna: పుష్ప 2 సెట్ నుంచి ఆ ఫోటోను షేర్ చేసిన రష్మిక.. ఫోటోస్ వైరల్?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగుతో పాటు తమిళం హిందీ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ

  • Written By:
  • Publish Date - February 13, 2024 / 09:30 AM IST

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగుతో పాటు తమిళం హిందీ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది రష్మిక. ఇటీవలె యానిమల్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఈ మూవీతో భారీ హిట్ ను అందుకుంది. కాగా రష్మిక నటిస్తున్న సినిమాల్లో పాన్ ఇండియా మూవీ పుష్ప 2 ఒకటి. రష్మిక మందన్న నటించిన పుష్ప సినిమా ఆమెకు పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చిపెట్టింది. దాంతో ఈ సినిమా సీక్వెల్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా హీరోయిన్ రష్మిక మందన్న సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. ఆ ఫొటోస్ పుష్ప 2 సినిమా షూటింగ్లో తీసుకున్నవని అర్థమవుతోంది. అయితే పుష్ప 2 సినిమాలో హీరో అల్లు అర్జున్ గతంలో దర్శకుడు సుకుమార్ క్యాండిడ్ ఫోటోలను క్లిక్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు రష్మిక మందన్న వంతు వచ్చింది. సుకుమార్ సింహం విగ్రహంపై చేతులు పెట్టి ఫోజ్ ఇచ్చిన ఫోటో తీసింది రష్మిక మందన్న. ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ ఫొటోస్ ని చూసిన అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇకపోతే 2021 లో విడుదలైన పుష్ప పార్ట్ వన్ కి సీక్వల్ గా పుష్ప పార్ట్ 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగు శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో వెయిట్ చేస్తున్నారు..