Rashmika Mandanna: రెమ్యూనరేషన్ పెంచిన రష్మిక.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా!

 నేషనల్ క్రష్ రష్మిక మందన్న టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.

  • Written By:
  • Updated On - December 9, 2023 / 12:35 PM IST

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. తాజాగా యానిమల్ సక్సెస్ ఈ బ్యూటీ క్రేజ్ మరింత పెరిగింది. మొదటిసారి ఆమె మహిళా చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీలో నటిస్తోంది. అయితే ఈ సినిమా కోసం ఈ బ్యూటీ రూ. 3 కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం. రష్మిక ఈ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభించింది. “టాలీవుడ్‌లో ఆమె మొదటి మహిళా ఆధారిత చిత్రం కావడంతో పారితోషికాన్ని పెంచింది. దీంతో ఆమె అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరిగా మారింది.

ప్రస్తుతం రష్మిక కు మంచి మార్కెట్ ఉంది. దీంతో నిర్మాతలు కూడా అడిగినంత డబ్బును ఆఫర్ చేస్తున్నారు. ఆమె మహేష్ బాబు (సరిలేరు నీకెవ్వరు), అల్లు అర్జున్ (పుష్ప), విజయ్ దేవరకొండ (గీతా గోవిందం) విజయ్ (వారసుడు) వంటి సూపర్ స్టార్‌లతో పని చేసింది. మొదట్లో తక్కువ రెమ్యూనరేషన్ కు సినిమాలు చేసింది. ఆమె సూపర్‌స్టార్‌లతో పనిచేసినప్పుడు రూ. 1.5 నుండి 2 కోట్ల వరకు చెల్లించారు. కానీ సక్సెస్ రేటు పెరగడంతో తన పారితోషికం పెంచేసింది.

‘యానిమల్’ సినిమా పెద్ద సక్సెస్ తర్వాత రష్మిక కూడా బాలీవుడ్‌లో బిజీ కాబోతోంది. “రష్మిక ఎట్టకేలకు బాలీవుడ్‌లో విజయాన్ని చవిచూసింది. ఆమెకు వరుస ఆఫర్‌లు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే ఏడాది చాలా హైప్ ఉన్న ‘పుష్ప 2’ తెరపైకి వచ్చిన తర్వాత ఆమె తన తెలుగు చిత్రాలను కూడా తగ్గించుకోవచ్చు” అని తెలుస్తోంది.