హైదరాబాద్: అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తన తదుపరి బాలీవుడ్ చిత్రం ‘యానిమల్’ కోసం సిద్ధమవుతున్నాడు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ రష్మిక మందనా ఈ రాబోయే సినిమాలో ఒక ప్రత్యేక పాట కోసం చర్చలు జరుపుతున్నందున, ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి.సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగా రణబీర్ కపూర్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. అల్లు అర్జున్ ‘పుష్ప: ది రైజ్’లో ప్రేక్షకులను అలరించిన రష్మిక మందనా ‘యానిమల్’లో ప్రత్యేక పాటలో కనిపించనుందని సమాచారం.
ఈ ప్రత్యేక పాట కోసం దర్శకుడు సందీప్ రెడ్డి నటి రష్మికమందనా తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రత్యేక సాంగ్ చేయడానికి ఆ నటి అంగీకరించిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. రష్మిక మందనా చివరిసారిగా శర్వానంద్కి జోడీగా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాలో నటించింది. బాలీవుడ్లో రెండు పెద్ద సినిమాలతో పాటు, రష్మిక ‘పుష్ప’ సీక్వెల్ ‘పుష్ప: ది రూల్’లో కనిపించనుంది.