Ranbir Touches Feet of SSR:రాజ‌మౌళి పాదాల‌ను మొక్కిన ర‌ణ‌బీర్‌.. వైర‌ల్ అవుతున్న వీడియో!

బ్రహ్మాస్త్ర.. 2022లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. రణబీర్ కపూర్, అలియా భట్ నటించిన అయాన్ ముఖర్జీ చిత్రం రెండు రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉంది.

  • Written By:
  • Updated On - August 27, 2022 / 09:45 AM IST

బ్రహ్మాస్త్ర.. 2022లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. రణబీర్ కపూర్, అలియా భట్ నటించిన అయాన్ ముఖర్జీ చిత్రం రెండు రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. అభిమానులు ఇప్పటికే ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి స్టార్స్ ప్ర‌తి అవ‌కాశాన్ని వాడుకుంటున్నారు. ఇటీవల రణబీర్ కపూర్, నాగార్జున, SS రాజమౌళి ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి చెన్నైకి వచ్చారు. ముగ్గురు స్టార్ క‌లవ‌డం, ఫొటోల‌కు ఫోజులివ్వ‌డం వైరల్‌గా మారింది. అయితే రణబీర్ రాజమౌళి పాదాలను తాకిన వీడియో అభిమానుల మ‌నసుల‌ను గెలుచుకుంది. ప్ర‌స్తుతం ఆ వీడియో ఇంట‌ర్నెట్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

డెనిమ్ జాకెట్, క్రీమ్-రంగు ప్యాంట్‌తో లేయర్డ్ వైట్ టీ ధరించి, తెల్లటి బూట్లు, బ్లాక్‌ సన్ గ్లాసెస్‌తో తన లుక్‌ను పూర్తి చేసిన రణబీర్ కపూర్ నాగార్జునతో మాట్లాడుతున్నాడు. ఎస్ఎస్ రాజమౌళి వారి వద్దకు వచ్చిన క్షణం, రణబీర్ ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా కిందకు వంగి పాదాలను తాకి న‌మ‌స్కారం చేశాడు. . ఆ తర్వాత రాజమౌళి వెంట‌నే ర‌ణ్ బీర్ ను ప‌ట్టుకొని హ‌గ్ ఇచ్చాడు.

రణబీర్ కపూర్- అలియా భట్ బ్రహ్మాస్త్ర సినిమాను ఎస్ఎస్ రాజమౌళి ప్రశంసించారు. బ్రహ్మాస్త్ర గురించి ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ.. ఈ చిత్రం భారతీయ సంస్కృతిని ప్రపంచానికి తీసుకెళ్తుందని అన్నారు. ఈ చిత్రాన్ని సమర్పిస్తున్న రాజమౌళి, ఈ సంవత్సరం అత్యంత ఎదురుచూస్తున్న చిత్రాలలో ఇది ఒకటి మాత్రమే కాదు, ఇది అత్యంత భారీ బ‌డ్జెట్ సినిమా కూడా. ఈ సినిమాపై బాలీవుడ్ ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది.