Ram : అక్కడ మార్కెట్ చూసుకుని భారీగా పెంచేసిన రామ్.. మైండ్ బ్లాక్ అయ్యే రెమ్యునరేషన్..!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ (Ram) ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్నాడు. ది వారియర్, స్కంద సినిమాతో నిరాశపరచిన రామ్ డబుల్ ఇస్మార్ట్ తో

  • Written By:
  • Publish Date - April 19, 2024 / 06:51 PM IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్ (Ram) ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్నాడు. ది వారియర్, స్కంద సినిమాతో నిరాశపరచిన రామ్ డబుల్ ఇస్మార్ట్ తో తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నాడు. యువ హీరోలంతా ప్రయోగాలతో సత్తా చాటుతుంటే రామ్ మాత్రం రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలు చేస్తున్నాడు. అయినా కూడా రామ్ కు ఉన్న మార్కెట్ దృష్ట్యా అతనికి భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నారు.

డబుల్ ఇస్మార్ట్ కోసం రామ్ పాతిక కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుంటాడని టాక్. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో హిట్ టార్గెట్ తో డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కుతుంది. ఈ సినిమా తెలుగులోనే కాదు పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగినట్టుగానే సినిమాలో సంజయ్ దత్ లాంటి స్టార్స్ ని తీసుకున్నారు.

ఇదిలాఉంటే డబుల్ ఇస్మార్ట్ తర్వాత రాం తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడన్నది ఇంకా వెల్లడించలేదు. అయితే లేటెస్ట్ గా ఒక నిర్మాత రామ్ తో సినిమా తీయాలని అనుకోగా అతను అడిగిన రెమ్యునరేషన్ తో మైండ్ బ్లాక్ అయ్యిందని టాక్. ఇంతకీ రామ్ ఎంత రెమ్యునరేషన్ అడిగాడు అంటే డబుల్ ఇస్మార్ట్ కు తీసుకుంటున్న పాతికకు మరో ఐదు కోట్లు యాడ్ చేసి మొత్తం 30 కోట్లు ఇస్తే సినిమా చేస్తా అన్నాడట.

తెలుగు సినిమాకు పెరిగిన మార్కెట్ తో పోల్చితే రామ్ అడిగింది న్యాయమే అనిపిస్తుంది. కానీ సరైన సక్సెస్ ఫాం లో లేని రామ్ ఇంత భారీ రెమ్యునరేషన్ అడగడం అందరినీ షాక్ ఇస్తుంది. అంతేకాదు టైర్ 2 హీరోలు కూడా పాతిక ముమ్మపై కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటే సినిమా బడ్జెట్ కూడా 70 కోట్ల దాకా వెళ్తుంది. సినిమా హిట్ అయితే పర్లేదు కానీ ఫ్లాప్ అయితే మాత్రం నిర్మాతలకు భారీ లాసులు వస్తాయి. మరి రెమ్యునరేషన్ విషయంలో రామ్ లెక్కలు ఏంటో కానీ నిర్మాతలు మాత్రం వెనకడుగు వేస్తున్నారు.

రామ్ హిందీ మార్కెట్ బాగానే ఉంటుంది. ఒకవేళ అది దృష్టిలో ఉంచుకుని 30 కోట్లు రెమ్యునరేషన్ అడిగి ఉండొచ్చు కానీ రామ్ అడిగినంత మాత్రాన నిర్మాతలు అంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు రెడీగా లేరన్నది వాస్తవం.