Site icon HashtagU Telugu

Ram Charan : G20 సదస్సులో రామ్ చరణ్.. ఫిలిం టూరిజం ఆర్థికాభివృద్ధి ప్యానల్ మెంబర్ గా..

Ram Charan participating in G20 summit 2023 at Srinagar

Ram Charan participating in G20 summit 2023 at Srinagar

ఈసారి G20 సదస్సులు మన ఇండియా(India)లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా G20 సదస్సు జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్(Srinagar) లో నిర్వహిస్తున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. జమ్మూకశ్మీర్(Jammu Kashmir) కు రాష్ట్ర హోదా తొలగించిన తర్వాత, ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జరిగే మొదటి అంతర్జాతీయ సదస్సు కావడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ G20 సదస్సుకు సభ్య దేశాల నుంచి దాదాపు 60 మంది ప్రతినిధులు రానున్నారు. ఈ సదస్సులో ముఖ్యంగా ఫిలిం టూరిజం, సినిమా అభివృద్ధి, దేశాల మధ్య ఫిలిం పాలసీల గురించి చర్చలు జరగనున్నాయి. ఈ G20 సదస్సులో ఫిలిం టూరిజం ఆర్ధికాభివృద్ధి, సాంసృతిక పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్యానల్ లో 17 దేశాల నుంచి ప్రతినిధులు మెంబర్స్ గా ఉండగా మన దేశం నుంచి రామ్ చరణ్ ఉండటం విశేషం.

ఈ ప్యానల్ నిర్వహించే సమావేశాల్లో చరణ్ ఇండియన్ సినిమాతో పాటు, కశ్మీర్ గురించి మాట్లాడనున్నారు. ప్రపంచం ముందు ఫిలిం టూరిజంలో భాగంగా కశ్మీర్ ని ప్రమోట్ చేయబోతున్నారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి చరణ్ శ్రీనగర్ వెళ్లారు. నేడు మధ్యాహ్నం జరిగిన ఓ సదస్సులో చరణ్ పాల్గొని కశ్మీర్ గురించి, కశ్మీర్ లో జరిగిన సినిమా షూటింగ్స్ గురించి, తనకు కశ్మీర్ తో ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు.

మరో మూడు రోజులు రామ్ చరణ్ శ్రీనగర్ లోనే ఉండి G20 సదస్సు సమావేశాల్లో పాల్గొననున్నారు. దీంతో చరణ్ అభిమానులు గర్వంగా ఫీల్ అవుతున్నారు. పలువురు ప్రముఖులు చరణ్ ని అభినందిస్తున్నారు.

 

Also Read : Keerthy Suresh: సరైన సమయంలో నా మిస్టరీ మ్యాన్ ను పరిచయం చేస్తా: పెళ్లిపై కీర్తి సురేశ్ రియాక్షన్!