SEE PIC : మాస్ కా మాస్టర్స్.. రాంచరణ్, ఎన్టీఆర్ పిక్ వైరల్!

దర్శకధీరుడు, బాహుబలి ఫేం ఎస్ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ ఆర్ఆర్ఆర్ రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - November 10, 2021 / 12:18 PM IST

దర్శకధీరుడు, బాహుబలి ఫేం ఎస్ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ ఆర్ఆర్ఆర్ రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్నారు. ఈ మల్టీస్టారర్ మూవీ కోసం ఇండియానే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తికావోవచ్చింది. రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించింది. ఇక ప్రొమోషన్ పై ఫోకస్ పెట్టింది ఆర్ఆర్ఆర్ టీం. రోజుకో అదిరిపొయే అప్ డేట్ ఇస్తూ అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. రీసెంట్ గా నాటు.. నాటు సాంగ్ ప్రోమో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సాంగ్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. తాజాగా పూర్తిగా పాటను విడుదల చేయనున్నారు.

అయితే ఆ పాట చిత్రీకరణలో హీరోలు ఎన్టీఆర్, రామచరణ్ నవ్వులు పూయిస్తూ, కబుర్లు చెప్పుకుంటున్న ఫొటోను ఒకటిని ఆర్ఆర్ టీం విడుదల చేసింది. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ట్విట్టర్‌లో ఫోటోను షేర్ చేస్తూ.. మాస్ కా మాస్టర్స్ చిల్లింగ్ అంటూ రాసుకొచ్చారు. RRR రెండో పాటు నాటు నాటు ఈరోజు సాయంత్రం 4 గంటలకు విడుదల కానుంది. హై వోల్టేజ్ డ్యాన్స్ తో వస్తున్న ఈ పాట హిందీలో నాచో నాచో అనే టైటిల్‌తో రానుంది. ఈ చిత్రానికి సంగీతం కీరవాణి అందించారు. తెలుగు వెర్షన్ పాటను రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాడాగా, చంద్రబోస్ సాహిత్యం అందించారు. RRR జనవరి 7, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్, సముద్రఖని, అలిసన్ డూడీ, రే స్టీవెన్‌సన్ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి కథ వి.విజయేంద్రప్రసాద్ కాగా, కె.కె. డిఓపిగా సెంథిల్ కుమార్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్. ప్రపంచవ్యాప్తంగా జనవరి 7న విడుదల కానుంది ఈ మూవీ.