Rakul Preet Singh: ప్రియుడితో ఏడడుగులు వేసిన రకుల్ ప్రీత్ సింగ్.. నెట్టింట ఫోటోస్ వైరల్?

  • Written By:
  • Publish Date - February 22, 2024 / 09:05 AM IST

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి మనందరికీ తెలిసిందే. మొన్నటి వరకు తెలుగులో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అవకాశాలు లేకపోవడంతో సినిమాలను పూర్తిగా తగ్గించేసింది. టాలీవుడ్ లో సినిమా అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. కాగా ఆ సంగతి పక్కన పెడితే రెండు వారాలుగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు సోషల్ మీడియాలో మారమగుతున్న విషయం తెలిసిందే. అందుకు గల కారణం ఆమె పెళ్లి.

గత కొంతకాలంగా నటుడు నిర్మాత భగ్నానీతో ప్రేమలో మునిగితేలుతున్న ఈమె తాజాగా తన ప్రియుడిని పెళ్లి చేసుకొని మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. తాజాగా వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో రకుల్ ప్రీత్ సింగ్ చాలా సంతోషంగా కనిపించింది. ఫిబ్రవరి 21వ తేది మధ్యాహ్నం 3గంటల 30 నిమిషాలకు గోవాలో రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి బాజాలు మోగాయి. గోవాలోని ఐటీసీ గ్రాండ్ సౌత్ ఆనంద్ కరాజ్ అనే రిసార్ట్ లో పంజాబీ సంప్రదాయంలో వీరి వివాహం జరిగింది. అత్యంత గ్రాండ్ గా జరిగిన ఈ సెలబ్రిటీ వెడ్డింగ్ సెర్మనీకి రెండు కుటుంబాలకు చెందిన వారితో పాటు క్లోజ్ ఫ్రెండ్స్, రాజకీయ ప్రముఖులు కొందరు అటెండ్ అయ్యారు.

నవ దంపతులను ఆశీర్వదించారు. ఇకపోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ వెడ్డింగ్ ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వేడుకలకు బాలీవుడ్ సెలబ్రిటీలు శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా, టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్, షాహీద్ కపూర్, వరుణ్ ధావన్, భూమి ఫడ్నేకర్, ఇషా డియోల్, సోనమ్ కపూర్ అటెండ్ అయ్యారు. కాగా రకుల్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు సెలబ్రిటీలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.