Aishwarya Rajinikanth: అతనితో ప్రేమలో పడిన ఐశ్వర్య రజనీకాంత్.. ఆశ్చర్య వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్!

  • Written By:
  • Publish Date - March 19, 2024 / 12:00 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ గురించి మనందరికి తెలిసిందే. ఆమె డైరెక్షన్ తో విడుదల అయిన చాలా సినిమాలు తెలుగులోనూ విడుదలై మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాయి. ఆమె దర్శకత్వంలో వచ్చిన త్రీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమాకు ఫాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో పాటలు ఇప్పటికీ మనకు వినిపిస్తూనే ఉంటాయి. ఇకపోతే ఇటీవలె లాల్ సలాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఐశ్వర్య రజినీకాంత్. ఈ సినిమా దారుణంగా డిజాస్టర్ అయ్యింది.

కాగా ఐశ్వర్య రజినీకాంత్ స్టార్ హీరో ధనుష్ సతీమణి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ జంట మొన్నామధ్య విడిపోయారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట దాదాపు 18 ఏళ్ల వివాహబంధానికి వీరు స్వస్తి చెప్పారు. విడాకుల తర్వాత ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ విడిగా ఉంటున్నారు. అయితే ధనుష్ హీరోగా బిజీగా ఉండగా.. ఐశ్వర్య తన సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఈ జంటకు ఇద్దరు కొడుకులు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఐశ్వర్య రజినీకాంత్ ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోబోతోంది అంటూ కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. దాని పై ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ఇటీవల ఈ అమ్మడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ధనుష్ హీరోగా ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో వచ్చిన త్రీ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. అనిరుధ్ గురించి ఐశ్వర్య రజినీకాంత్ మాట్లాడుతూ.. త్రీ సినిమాకు అనిరుధ్ ను ధనుష్ పరిచయం చేశాడు. ఆ సినిమా చేస్తున్నప్పుడు అతని వయసు 20 ఏళ్లు.. ఇప్పుడు అనిరుధ్ మ్యూజిక్ సెన్సేషన్ గా మారిపోయాడు. అనిరుధ్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉండటానికి తన మాజీ భర్త ధనుష్ కారణం అని తెలిపింది ఐశ్వర్య రజినీకాంత్. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాతో పాటు కోలీవుడ్ లో వైరల్ గా మారాయి. దాంతో ధనుష్ తో మరోసారి ఐశ్వర్య ప్రేమలో పడింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ ఇద్దరూ మళ్లీ కలిసిపోవాలని అభిమానులంతా కోరుకుంటున్నారు. మరి ఈ జంట తిరిగి కలుస్తారేమో చూడాలి మరి. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మొన్న విడాకులు తీసుకుని విడిపోయిన ఈ జంట మళ్ళీ కలవడం ఏంటి ఆమె ప్రేమలో పడడం ఏంటి పిచ్చి కాకపోతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వార్తలపై ఐశ్వర్య ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.