RC 17: సుకుమార్,చెర్రీ సినిమాపై అలాంటి కామెంట్స్ చేసిన కార్తికేయ.. ట్వీట్ వైరల్?

  • Written By:
  • Publish Date - March 26, 2024 / 08:40 AM IST

గత కొద్ది రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో రాబోతున్న సినిమాపై ఎన్నో రకాల వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తుండగా సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో కలిసి పుష్ప 2 సినిమా రూపొందిస్తూ అందుకు సంబంధించిన పనులలో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే తాజాగా సుకుమార్, చెర్రీ కాంబినేషన్ లో సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. రంగస్థలం సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఈ కాంబో మళ్ళీ రాబోతోంది.

చరణ్ గేమ్ ఛేంజర్, RC16 సినిమాలు అయ్యాక ఈ సినిమా ఉండబోతుంది. అధికారికంగా నిన్న అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేయగా పోస్టర్ పై జయించడానికి గర్జిస్తున్నాడు అనే అర్ధం వచ్చేలా రాసి రెండు గుర్రం బొమ్మలు కూడా వేశారు. దీంతో ఈ సినిమాపై ఇప్పటి నుంచే ఆసక్తి నెలకొంది. అయితే గతంలో RRR సినిమా సమయంలోనే రాజమౌళి, సుకుమార్, చరణ్ సినిమా కోసం వెయిటింగ్ అంటూ వ్యాఖ్యలు చేయగా అవి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా రాజమౌళి తనయుడు కార్తికేయ RC17 సినిమాపై ఆసక్తికర ట్వీట్ చేసాడు. కార్తికేయ తన ట్వీట్ లో ఈ విధంగా రాసుకొచ్చాడు. RRR సినిమా క్లైమాక్స్ షూట్ సమయంలో రామ్ చరణ్ సరదాగా సుకుమార్ సినిమా గురించి మాట్లాడారు.

 

ఈ సినిమాలో ఓపెనింగ్ సీక్వెన్స్ గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. అది వినగానే అయిదు నిమిషాల పాటు షాక్ కి గురయ్యాను. చరణ్ ఆ స్టోరీ చెప్పినప్పటి నుంచి నేను ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. నేను ఆల్రెడీ ఇది బ్లాక్ బస్టర్ అవుతుందని ఊహించేసుకున్నాను. ఈ సినిమాలో ఓపెనింగ్ సీన్ ఒక ఐకానిక్ సీక్వెన్స్ లా నిలిచిపోతుంది. ఇంతకంటే నేను ఎక్కువ లీక్ చేయను అంటూ చరణ్ ని ట్యాగ్ చేసాడు. దీంతో కార్తికేయ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. సినిమా మొదలవ్వకముందే రాజమౌళి, కార్తికేయ ఇలా సినిమా గురించి మాట్లాడటంతో ఇప్పటినుంచే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా కార్తికేయ తన ట్వీట్ తో ఈ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాడు.