SSMB29 : రాజమౌళి సినిమాలో మహేష్ డబల్ ట్రీట్.. వైరల్ అవుతున్న వార్త..

రాజమౌళి కోసం మహేష్ బాబు తన కెరీర్ లో మొదటిసారి డబల్ ట్రీట్ ఇవ్వడానికి సిద్దమవుతున్నారట.

  • Written By:
  • Publish Date - July 9, 2024 / 03:19 PM IST

SSMB29 : సూపర్ స్టార్ మహేష్ బాబు తన 29వ సినిమాని రాజమౌళితో చేస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి ఇంటర్నేషనల్ సక్సెస్ లు తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో గ్లోబల్ వైడ్ ఈ మూవీ పై మంచి బజ్ నెలకుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించబోతున్నారు.

ఈ సినిమా కథ ‘ఇండియానా జోన్స్’ తరహాలో ఉండబోతుందని రాజమౌళి ఇప్పటికే తెలియజేసిన సంగతి తెలిసిందే. ఆఫ్రికా అడవుల బ్యాక్‌డ్రాప్ తో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీని రాజమౌళి తెరకెక్కించబోతున్నారు. దీంతో హాలీవుడ్ గ్రాఫిక్స్ కంపెనీలను కూడా రాజమౌళి రంగంలోకి దించుతున్నారు. ఇది ఇలా ఉంటే, ఈ మూవీలో మరో ఎక్స్ట్రా ట్రీట్ కూడా ఉండబోతుందట. ఈ సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ చేయబోతున్నారని ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

మహేష్ బాబు ఇప్పటివరకు డ్యూయల్ చేయలేదు. కెరీర్ లో మొదటిసారి డబల్ ట్రీట్ ఇవ్వడానికి సిద్దమవుతున్నారట. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదుగాని, ప్రస్తుతం ఈ న్యూస్ తెగ హల్ చల్ చేస్తుంది. కాగా అభిమానులంతా ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ తరుణం కూడా వచ్చేసిందని చెబుతున్నారు. ఆగష్టు మొదటి వారంలో ఈ సినిమా కొబ్బరికాయ కొట్టుకోనుందని టాక్ వినిపిస్తుంది.

కాగా మహేష్ బాబు ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ఆడియన్స్ ని పలకరించారు. SSMB29 పూర్తి అయ్యేవరకు మరో సినిమాకి సైన్ చేసే అవకాశం లేదు. దీంతో మహేష్ ని మళ్ళీ స్క్రీన్ పై చూడాలంటే ఏళ్ళు పట్టేటట్టు ఉంది.

Follow us