Rajamouli: మహేష్ బాబు మూవీ తర్వాత రాజమౌళి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ “మహాభారతం”..! క్లారిటీ ఇచ్చిన విజయేంద్రప్రసాద్‌..!

‘ఆర్ఆర్ఆర్’ మూవీకి సీక్వెల్ తీయనున్నట్లు దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి (Rajamouli) ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాని హాలీవుడ్ స్టాండర్ట్స్‌లో తీయనున్నట్లు రచయిత విజయేంద్రప్రసాద్ చెప్పారు.

  • Written By:
  • Publish Date - July 10, 2023 / 03:00 PM IST

Rajamouli: ‘ఆర్ఆర్ఆర్’ మూవీకి సీక్వెల్ తీయనున్నట్లు దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి (Rajamouli) ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాని హాలీవుడ్ స్టాండర్ట్స్‌లో తీయనున్నట్లు రచయిత విజయేంద్రప్రసాద్ చెప్పారు. అయితే దాన్ని జక్కన్నగానీ, ఆయన పర్యవేక్షణలో మరొకరుగానీ దర్శకత్వం చేసే అవకాశముందని తెలిపారు. అదే సమయంలో మహేశ్ బాబు సినిమా తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ని ‘మహాభారతం’ని పట్టాలెక్కించేందుకు జక్కన్న సిద్దమవుతున్నట్లు వెల్లడించారు.

డైరెక్టర్ జక్కన్న దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. దాదాపు రూ. 500 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 1200 కోట్లు రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మహేశ్ బాబుతో చేయనున్న సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు రాజమౌళి. RRR సీక్వెల్ పై రాజమౌళి గతంలో చాలా సార్లు స్పందించారు. తను తెరకెక్కించే ప్రతి సినిమాకు తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ ఆర్ఆర్ఆర్ సినిమా సీక్వెల్‌కు సంబంధించిన కథను రెడీ చేస్తున్నట్టు గతంలో చెప్పారు.

Also Read: MS Dhoni: హార్ట్ బ్రేక్ మూమెంట్ కు 4 ఏళ్ళు.. మరోసారి వైరల్ అవుతున్న ధోనీ రనౌట్ వీడియో..!

ఇప్పుడు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’పై తాజాగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు రచయిత విజేంద్ర ప్రసాద్. భారతీయ ఇతిహాస గాధ మహాభారతాన్ని సినిమాగా తెరకెక్కించాలని రాజమౌళి ఎంతోకాలంగా అనుకుంటున్నారు. ఒకవేళ మహాభారతాన్ని తాను తెరకెక్కిస్తే దాన్ని పది భాగాలుగా రూపొందించాలని ఉందంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా రాజమౌళి స్పష్టం చేశారు. అయితే ఈ మహాభారతాన్ని ఓ అద్భుత దృశ్య కావ్యంగా రాజమౌళి ఏ విధంగా తెరకెక్కిస్తారనే ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో ఉంది. కానీ మహాభారతాన్ని రాజమౌళి ఎప్పుడు తెరకెక్కిస్తారనే విషయంపై ఇప్పటివరకు క్లారిటీ లేదు.

తాజాగా రచయిత విజయేంద్రప్రసాద్ ఇదే విషయమై క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు విజయేంద్రప్రసాద్. ఈ మేరకు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్టు ‘మహాభారతం’ మహేష్ బాబు సినిమా తర్వాత ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు చాలా బిగ్ స్కేల్ లో ఉంటుందని, దీనిపై రాజమౌళి మైండ్ లో ఎన్నో ప్లాన్స్ ఉన్నాయని చెప్పారు.