టాలీవుడ్ ఐకాన్ స్టార్ ఏమాత్రం సమయం దొరికినా ఫ్యామిలీతో సరదాగా గడిపేందుకు ఇష్టపడుతుంటాడు. వారితో టూర్లకు వెళ్తూ రిచార్జ్ అవుతుంటాడు. అల్లు అర్జున్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి టూర్కు వెళ్లాడు. పంజాబ్లోని అమృతసర్ గోల్డెన్ టెంపుల్కు వెళ్లాడు. ప్రస్తుతం నెట్టింట బన్నీ ఫ్యామిలీకి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
అల్లు స్నేహా రెడ్డి భర్త్ డే సందర్భంగా బన్నీ ఫ్యామిలీని తీసుకొని గోల్డెన్ టెంపుల్కు వెళ్లినట్లు తెలుస్తుంది. అయితే బన్నీ ఫ్యామిలీ స్నేహా రెడ్డి బర్త్ డే సందర్భంగా అమృతసర్లోని గోల్డెన్ టెంపుల్’ను దర్శించుకుంది. ఈ సందర్భంగా వారికి అక్కడున్న వారు ఘన స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన ఫోటోల్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. అక్కడున్న వారు ఈ సందర్భంగా బన్నీ ఫ్యామిలీకి దగ్గరుండి దర్శనం చేయించారు.
Allu family 🖤🖤@alluarjun ❤️ pic.twitter.com/a1JoGez9O4
— Allu Prashanth 🪓 (@Alluprashanth9) September 29, 2022