Pushpa Collections: 50 రోజుల్లో రూ. 365 కోట్లు కొల్లగొట్టిన ‘పుష్ప’

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడోసారి వచ్చిన సినిమా 'పుష్ఫ'. ఈ చిత్రంతో బన్నీని ఐకాన్ స్టార్ ని చేశాడు దర్శకుడు సుక్కు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన

  • Written By:
  • Publish Date - February 4, 2022 / 04:09 PM IST

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడోసారి వచ్చిన సినిమా ‘పుష్ఫ’. ఈ చిత్రంతో బన్నీని ఐకాన్ స్టార్ ని చేశాడు దర్శకుడు సుక్కు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ‘పుష్ఫ: ది రైజ్’ పార్ట్-1 ఎంతటి ఘన విజయం సాధించిందో మనం చూశాం. గత ఏడాది డిసెంబర్ 17న వరల్డ్ వైడ్ గా రిలీజైన ఈ మూవీ… అద్భుతమైన కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే 2021 ఇండియన్ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన ‘పుష్ప’.. కొత్త సంవత్సరంలోనూ అదే జోరు చూపించింది. ఓటీటీ ప్లాట్ ఫాంలోనూ తన దూకుడును కొనసాగిస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ‘పుష్ప’ సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

మరోవైపు నేషనల్, ఇంటర్నేషనల్ క్రికెటర్లు సైతం ఈ సినిమాకు ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేసి తమ టాలెంట్ ను ప్రదర్శిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ‘పుష్ప’ మేనియా ఇంకా కొనసాగుతోంది. పుష్పరాజ్ గా అల్లు అర్జున్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ‘తగ్గేదేలే’ అనే డైలాగ్ బాగా పాపులర్ అయింది. కరోనా సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత అత్యధిక వసూళ్లు తీసుకొచ్చిన భారతీయ చిత్రంగా ఐకాన్ స్టార్ నటించిన ‘పుష్ప’ నిలిచింది.

ఇకపోతే, తాజాగా ‘పుష్ప: ది రైజ్’ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 365 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ శుక్రవారం పోస్టర్ విడుదల చేశారు. ‘పుష్ప’ బాలీవుడ్ లో రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని పేర్కొన్నారు. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా బన్నీ తన సత్తాను చాటుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా… ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా ‘పుష్ప’ సినిమాను నిర్మించారు. ‘పుష్ఫ’ పార్ట్-1 తో సెన్సేషన్ క్రియేట్ చేసి, అత్యధిక వసూళ్లను కొల్లగొట్టిన బన్నీ… ‘పుష్ప’ పార్ట్-2 తో మరెన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకుంటాడో వేచి చూడాలి.