Pushpa 2 Artists: పుష్ప-2 ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న బస్సుకు యాక్సిడెంట్

పుష్ప-2 ఆర్టిస్టులు (Pushpa 2 Artists) ప్రయాణిస్తున్న బస్సుకు యాక్సిడెంట్ అయింది. నార్కట్‌పల్లి వద్ద వారు ప్రయాణిస్తోన్న బస్సును మరో బస్సు ఢీ కొట్టింది.

  • Written By:
  • Publish Date - May 31, 2023 / 09:42 AM IST

Pushpa 2 Artists: పుష్ప-2 ఆర్టిస్టులు (Pushpa 2 Artists) ప్రయాణిస్తున్న బస్సుకు యాక్సిడెంట్ అయింది. నార్కట్‌పల్లి వద్ద వారు ప్రయాణిస్తోన్న బస్సును మరో బస్సు ఢీ కొట్టింది. పలువురు ఆర్టిస్టులకు గాయాలయినట్లు తెలుస్తోంది. దీంతో హైదరాబాద్-విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఏడుగురు ఆర్టిస్టులకు గాయాలయినట్లు సమాచారం. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా ‘పుష్ప 2’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు షూటింగ్ నిమిత్తం కొంత మంది ఆర్టిస్టులు హైదరాబాద్ నుంచి విజయవాడ హైవే పై నార్కట్ పల్లి వద్ద పుష్ప 2 బస్సు, ఆర్టీసు బస్సు ఢీ కొట్టడంతో పుష్ప 2 మూవీ యూనిట్‌లోని వ్యక్తులు గాయపడ్డారు. ఈ ప్రమాదం గురించి స్థానికులు వెంటనే 100కు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసి తదుపరి చర్యలు చేపట్టారు.ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Also Read: Netaji Grandson Vs Savarkar Movie : సావర్కర్ మూవీపై నేతాజీ ముని మనవడు ఫైర్

అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఇక మూడో షెడ్యూల్ పూర్తయిందని తాజా సమాచారం. పుష్ప 2 షూటింగ్‌ ముగించుకుని వస్తున్న ఆర్టిస్టులకు రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.