Priyamani: బాలీవుడ్ తారలపై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రియమణి.. డబ్బులు ఇచ్చి మరీ ఫోటోలకు ఫోజులిస్తున్నారంటూ?

  • Written By:
  • Publish Date - February 24, 2024 / 09:30 AM IST

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ ప్రియమణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది ప్రియమణి. మొదట ఎవరే అతగాడు సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ప్రియమణి ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ టాప్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రియమణి తెలుగులో గోపీచంద్, ఎన్టీఆర్, జగపతి బాబు, నితిన్, బాలకృష్ణ రవితేజ లాంటి అగ్ర హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సినిమాలలో కూడా నటించింది.

తెలుగులో ఎక్కువ సినిమాలలో నటించింది. అంతేకాకుండా కన్నడ హిందీ తెలుగు భాషల్లో బుల్లితెరపై ప్రసారమయ్యే డ్యాన్స్ షోలకు జడ్జిగా కూడా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే ఇటీవలె సెకండ్ ఇన్నింగ్స్‏ ప్రారంభించిన ప్రియమణి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది ప్రియమణి. ఇటు ఓటీటీలోనూ వెబ్ సిరీస్ చేస్తుంది. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సక్సెస్ తర్వాత ఆమెకు హిందీలో వరుస అవకాశాలు వస్తున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ ఇలా అన్ని భాషల్లో సినిమా, వెబ్ సిరీస్ చేస్తూ తీరిక లేకుండా గడిపేస్తుంది. గత ఏడాది హిందీలో జవాన్, మలయాళంలో నెహ్రు చిత్రాల్లో నటించి హిట్స్ అందుకుంది. ఇక ఇటీవలే భామా కలాపం 2 వెబ్ సిరీస్ ద్వారా మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది. గతంలో వచ్చిన భామా కలాపం సిరీస్ కు సీక్వెల్ ఇది.

ప్రస్తుతం ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. విడుదలైన ఐదు రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్ అందుకుంది. మరోసారి క్రైమ్ సస్పెన్న్ కామెడీ సిరీస్ తో ప్రేక్షకులకు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. ఇదిలా ఉంటే హిందీలో హీరోయిన్ యామి గౌతమ్ నటించిన ఆర్టికల్ 370లో ప్రియమణి కీలకపాత్ర పోషించింది. కశ్మీర్ ప్రత్యేక హోదాను తీసివేయడం నేపథ్యంలో రూపొందిన సినిమా. అయితే ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి బాలీవుడ్ తారల రహస్యాన్ని బయటపెట్టింది. ఇన్నాళ్లు నెటిజన్స్, అభిమానులకు ఉన్న సందేహాలను ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చేసింది. బాలీవుడ్ తారలు ఎక్కడికి వెళ్లినా వారి వెంటే పాపరాజీలు ఉంటారు. ఎయిర్ పోర్టు, జిమ్, వాకింగ్, షాపింగ్.. ఇలా ఎక్కడికి వెళ్లినా అక్కడ కొందరు ఫోటోగ్రాఫర్స్ వారిని ఫోటోస్, వీడియోస్ తీస్తుంటారు.

అయితే అలా మనల్ని ఎవరూ ఎందుకు ఫోటోస్ తీయరు? నేను జిమ్, ఎయిర్ పోర్ట్ వెళ్తాను. అప్పుడేందుకు వాళ్లు కనిపించరు అనే సందేహాలు చాలాసార్లు వచ్చాయి. ఇదే విషయాన్ని నేను నా సహచరులకు అడగగా అప్పుడు అసలు విషయం తెలిసి షాకయ్యాను. నటీనటులు తాము ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నామనే విషయాన్ని ముందుగానే ఫోటోగ్రాఫర్లకు తెలియజేస్తారని, అందుకు వారికి కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. బాలీవుడ్‌లోని చాలా మంది తారలు అలా డబ్బు చెల్లించి పబ్లిసిటీ కోరుకుంటారని ఈ విషయం తెలిసి నేను ఆశ్చర్యపోయను అని చెప్పుకొచ్చింది ప్రియమణి. ఒక్కో ఫోటోగ్రాఫర్ కు ఒక్కో ధర ఉంటుందని తెలిసి నమ్మలేకపోయానని తెలిపింది. ఈ మేరకు ప్రియమణి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.