Rakul-Jackky Bhagnani: రకుల్, జాకీ దంపతులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపిన నరేంద్ర మోడీ?

  • Written By:
  • Publish Date - February 23, 2024 / 09:30 AM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా తన ప్రియుడు జాకీ భగ్నానీతో మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట ఎట్టకేలకు తాజాగా ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. అయితే ప్రస్తుతం ఈ జంట పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు సెలబ్రిటీలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా తాజాగా ఈ జంట ఫిబ్రవరి 21న గోవాలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

అయితే ఈ జంట పెళ్లికి కేవలం కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత రిసెప్షన్ గ్రాండ్గా నిర్వహించి టాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రిటీలను ఇన్వైట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరు ముందుగా తమ పెళ్లిని దుబాయ్ లేదా మాల్దీవ్స్ లో చేసుకోవాలని అనుకున్నారు. కానీ మాల్దీవ్స్ ఇష్యూ, ఇండియా టూరిజం అభివృద్ధి గురించి ప్రధాని మోదీ మాట్లాడడంతో వీరి వివాహ వేదికను గోవాకు మార్చుకున్నారు. గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్ట్ లో జరిగే తమ పెళ్లికి హాజరుకావాలంటూ ప్రధాని మోదీకి ఆహ్వానం పంపించారు. అయితే అప్పటికే ఫిక్స్ అయిన షెడ్యూల్స్ కారణంగా మోదీ వీరి వివాహానికి హాజరుకాలేదు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

రకుల్, జాకీకి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేకంగా ఒక నోట్ రాసుకొచ్చారు ప్రధాని మోదీ. ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపింది రకుల్. రకుల్ జాకీ.. ఇద్దదు వారి జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ ప్రయాణంలో వారి జీవితం ఎంతో సంతోషంగా సాగాలి. అటువంటి అద్భుతమైన జీవితానికి మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరాలు మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకే బాటలో పయనించాలి. ఈ ప్రేమ ఇద్దరి మనసులు.. ఆలోచనలు.. పనులు కలిసి ఉండాలి. ఎప్పుడూ ఒకరికొకరు అండగా ఉండాలి. అన్నీ రాబోయే బాధ్యతలను ధైర్యంగా, ఆలోచనతో కూడిన ప్రేమతో నిర్వహించాలి. తన భార్యకు ఎప్పుడూ అండగా ఉండాలి. ఒకరిలోని మంచి లక్షణాలను మరొకరు నేర్చుకోండి. నన్ను మీ పెళ్లికి ఆహ్వానించినందుకు చాలా కృతజ్ఞతలు.. ఇలా మళ్లీ ఒక అందమైన ఈవెంట్ కోసం నా శుభాకాంక్షలు.. మీకు నా ఆశీస్సులు అంటూ నరేంద్ర మోదీ ఒక స్పెషల్ నోట్ పంపారు.